Webdunia - Bharat's app for daily news and videos

Install App

''అమర్ అక్బర్ ఆంటోని''లో కిక్ రాజాతో నటించాలా? అంత ఇవ్వాల్సిందే: ఇలియానా

రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. కిక్ సినిమాతో హిట్ పెయిర్‌గా గు

Webdunia
గురువారం, 24 మే 2018 (11:42 IST)
రవితేజ హీరోగా శ్రీను వైట్ల 'అమర్ అక్బర్ ఆంటోని' సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికల అవసరం ఉండగా, ఒక కథానాయికగా ఇలియానాను ఎంపిక చేసుకున్నారట. కిక్ సినిమాతో హిట్ పెయిర్‌గా గుర్తింపు సంపాదించుకున్న ఈ జంట కలిసి నటించడం ప్రస్తుతం అంచనాలను పెంచేస్తుంది. 
 
తెలుగు తెరకి నాజూకు సౌందర్యాన్ని పరిచయం చేసిన కథానాయికలలో ఇలియానా ఒకరు. తెలుగులో అగ్ర హీరోల జోడీ కడుతూ, యూత్‌ను ఒక ఊపు ఊపేసింది. ప్రస్తుతం బాలీవుడ్‌కు మకాం మార్చిన ఇలియానా.. తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటోంది. ఇందుకోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. రవితేజ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసింది. 
 
ఛాన్స్ దొరికిందని ఎగిరి గంతేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ సినిమాలో నటించేందుకు భారీ పారితోషికం డిమాండ్ చేసిందట. ఇందుకోసం ఆమె 2 కోట్ల పారితోషికం డిమాండ్ చేయగా నిర్మాతలు అంగీకరించినట్టుగా సమాచారం. ఇంత గ్యాప్ తరువాత కూడా ఇలియానా పారితోషికం విషయంలో ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. గతంలో రవితేజ .. ఇలియానా కాంబినేషన్లో 3 సినిమాలు రాగా వాటిలో 'కిక్' సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments