Webdunia - Bharat's app for daily news and videos

Install App

శర్వానంద్ పైన రూ. 35 కోట్లు వస్తుందా? హనూ... నువ్వు మారవా?

Webdunia
సోమవారం, 17 డిశెంబరు 2018 (12:33 IST)
శ‌ర్వానంద్, సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు. ఈ సినిమాకి హ‌ను రాఘ‌వ‌పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ నెల 21న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు రెడీ అయ్యింది. అయితే... హ‌ను రాఘ‌వ‌పూడి అందాల రాక్ష‌సి సినిమాని ఎంత బాగా తెర‌కెక్కించాడో తెలిసిందే. ఆ సినిమాని చెక్కుతూ తీయ‌డం వ‌ల‌న బ‌డ్జెట్ పెరిగింది. సినిమా ఫ్లాప్ అవ్వ‌డం వ‌ల‌న లాస్ వ‌చ్చింది. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ సినిమా కూడా బ‌డ్జెట్ పెరిగిపోయింద‌ట. కాక‌పోతే నాని వ‌ల‌న నిర్మాత లాస్ నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు.
 
లై సినిమా దారుణ ఫలితాన్ని మిగిల్చింది. సినిమాకు యావరేజ్ టాక్ రాగా.. వచ్చిన వసూళ్లు బడ్జెట్లో సగం కూడా లేవు. ఆ చిత్రం మెజారిటీ షూటింగ్ అమెరికాలో చేశారు. వర్కింగ్ డేస్ పెరిగి బడ్జెట్ అదుపు తప్పింది. ఏకంగా రూ.40 కోట్ల దాకా పెట్టించేశాడు హను. దీంతో నిర్మాతలు నిండా మునిగిపోయారు. 14 రీల్స్ లాంటి పెద్ద నిర్మాణ సంస్థ నుంచి మళ్లీ సినిమానే రాలేదంటే ఆ సినిమా ఎఫెక్ట్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
 
తాజా చిత్రం ప‌డి ప‌డి లేచె మ‌న‌సు వ‌ర్కింగ్ డేస్ ఎక్కువ కావ‌డం వ‌ల‌న 30 కోట్లు దాటింది. ఫైనాన్స్ వ‌డ్డీలు క‌లుపుకుంటే 35 కోట్లు అయ్యింద‌ట‌. ఈ సినిమా పాజిటివ్ టాక్ ఉంది కానీ... శ‌ర్వానంద్ పైన 35 కోట్లు వ‌స్తుందా అనేది అనుమాన‌మే. హ‌ను రూటు మార్చి బ‌డ్జెట్ కంట్రోల్‌లో ఉండేలా చూసుకోవాలి లేదంటే కెరీర్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కర్నూలు జిల్లాలో రిలయన్స్ ప్లాంట్.. ఏం తయారు చేస్తారు?

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి వర్ష సూచన

ఆర్కెస్ట్రా డ్యాన్సర్‌ను పెళ్లి చేసుకున్నాడనీ వ్యక్తి దారుణ హత్య!

మియాపూర్‌లో పేద విద్యార్థులకు బ్యాక్ టు క్లాస్‌రూమ్ కిట్‌లను పంపిణీ చేసిన క్వాలిజీల్

345 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు : ఈసీ సంచలన నిర్ణయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments