Webdunia - Bharat's app for daily news and videos

Install App

థియేటర్లలో పడనున్న బొమ్మ... రోజుకు 3 ఆటలే?

Webdunia
శుక్రవారం, 22 మే 2020 (12:21 IST)
కరోనా కష్టాలు ప్రతి రంగాన్ని పట్టిపీడిస్తున్నాయి. ఇందులోభాగంగా సినిమా థియేటర్లు కూడా మూతపడ్డాయి. గత మార్చి నెలాఖరు నుంచి మూతపడిన ఈ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే పరిస్థితి లేదు. ప్రస్తుతం నాలుగో దశ లాక్డౌన్ కొనసాగుతోంది. ఇది ఈ నెలాఖరు వరకు కొనసాగనుంది. అయితే, పలు అంశాల్లో లాక్డౌన్ ఆంక్షలను కేంద్రం సడలించింది. అయితే, మాల్స్, హోటల్స్(డైనింగ్), థియేటర్లను మాత్రం తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. 
 
ఇకపోతే, కొన్ని అంశాల్లో లాక్డౌన్ ఆంక్షలు సడలింపులు ఇస్తుండటంతో థియేట‌ర్స్ కూడా త్వ‌ర‌లో ఓపెన్ అవుతాయ‌ని సినీ ప్రియులు ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 21వ తేదీన మెగాస్టార్ చిరంజీవి నివాసంలో సినీ పెద్దలు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా హాజరయ్యారు. 
 
ఇందులో సినిమా షూటింగ్స్‌తో పాటు థియేట‌ర్స్ రీఓపెన్ గురించి కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపిన విష‌యం తెలిసిందే. సీఎం కేసీఆర్‌తో మాట్లాడి ఈ విష‌యాల‌పై త్వ‌ర‌లోనే క్లారిటీ ఇస్తాన‌ని త‌ల‌సాని సినీ ప్రముఖులకు హామీ ఇచ్చారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఆగస్టులో ఇటు తెలంగాణ అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో థియేట‌ర్స్ ఓపెన్ అవుతాయ‌నే టాక్ వినిపిస్తుంది. సింగిల్ స్క్రీన్‌లో ప్ర‌తి రోజు మూడు షోస్ ఉండేలా నిర్ణ‌యం తీసుకుంటార‌ని తెలుస్తుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments