Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సుద్దాల అశోకతేజకు అస్వస్థత - కాలేయ మార్పిడి చికిత్స చేయాలట?! (video)

సుద్దాల అశోకతేజకు అస్వస్థత - కాలేయ మార్పిడి చికిత్స చేయాలట?! (video)
, శుక్రవారం, 22 మే 2020 (08:46 IST)
తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ గేయ రచయిత, అశోక్ తేజ తీవ్ర అస్వస్థతులోనయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆయనకు విధిగా కాలేయ మార్పిడి చికిత్స చేయాల్సివుంటుందని వైద్యులు వెల్లడించారు. 
 
తన సొంత ఊరు సుద్దాల‌ని త‌న ఇంటి పేరుగా మార్చుకున్న ఈయ‌న 'నమస్తే అన్న' చిత్రం ద్వారా తెలుగు సినీ తెరకి పరిచయమయ్యాడు. సినీ నటుడు ఉత్తేజ్‌కి సుద్దాల‌ మేనమామ కావడం వల్ల పరిశ్రమకు పరిచయం కావడం అంత కష్టం కాలేదు. 
 
అయితే, ఆయనది బీ నెగెటివి రక్తగ్రూపు కావడంతో ఆపరేషన్ సమయంలో అధిక మోతాదులో రక్తం కావాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ గ్రూపు రక్తాన్ని సేకరించే పనిలో సుద్దాల అశోక తేజ సన్నిహింతులు ఉన్నట్టు సమాచారం. 
 
అయితే, లాక్డౌన్ కారణంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో రక్తం కొరత ఎక్కువగా ఉన్న విషయం తెల్సిందే. దీంతో ఇటీవలే పలువురు సినీ హీరోలతోపాటు.. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా రక్తదాన చేసి.... ఇతరులు కూడా రక్తదానం చేసేందుకు ముందుకురావాలంటూ పిలుపునిచ్చారు. 
 
కాగా, నటుడు తనికెళ్ళ భరణి వంటి నటుల ప్రోత్సాహంతో సినిమా రంగంలో పాటల ప్రస్థానం ప్రారంభించాడు. ఎన్నో అద్భుత‌మైన గేయాల‌తో అల‌రించిన ఆయ‌న త్వ‌ర‌గా కోలుకోవాల‌ని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. 
 
దర్శకరత్న దాసరి నారాయణ రావు తీసిన రాములమ్మ చిత్రంలోని పాటలన్నీ రాశారు. ఈ పాటలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఒక విధంగా చెప్పాలంటే ఈ చిత్రం విజయానికి అశోక తేజ గేయ రచనే అని చెప్పొచ్చు. పైగా, ఈ చిత్రంలో ఆయన ఓ పాటను కూడా పాడారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిర్మాత రాజశేఖర్‌ రెడ్డి 11 లక్షలు కరోనా సాయం..