Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ - పరశురాం కాంబో ... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? (video)

మహేష్ - పరశురాం కాంబో ... బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుందా? (video)
, బుధవారం, 20 మే 2020 (09:08 IST)
సూపర్ స్టార్ మహేష్ బాబు - 'గీత గోవిందం' ఫేమ్ పరశురామ్ కాంబినేషన్‌లో ఓ భారీ చిత్రం ప్లాన్ జరుగుతుందని గత కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. 'సరిలేరు నీకెవ్వరు' సినిమా తర్వాత చాలా కథలు విని ఆఖరికి మహేష్ బాబు పరశురామ్ చెప్పిన స్టోరీకి ఓకే చెప్పాడు. 
 
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజైన మే 31న ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే... ఈ మూవీ ప్రారంభోత్సవాన్ని లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా చాలా తక్కువ మందితో.. గెస్ట్‌లు ఎవరూ లేకుండా పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో మహేష్ సరసన నటించే హీరోయిన్ ఎవరనేది ఇంకా అఫిషియల్‌గా ప్రకటించలేదు కానీ.. కన్ఫర్మ్ చేసారని సమాచారం. 
 
మెచ్యూర్డ్ లవ్ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్‌గా నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. 'మహర్షి' సినిమాలో మహేష్ కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించారు. ఈ సినిమాలో కూడా కాలేజ్ స్టూడెంట్‌గా నటించనున్నాడని టాక్ రావడంతో ఫ్యాన్స్ మరింత ఆసక్తితో ఈ మూవీ అప్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
 
త్వరలోనే ఈ మూవీ గురించి పూర్తి వివరాలను ఎనౌన్స్ చేయనున్నారని తెలిసింది. వరుస విజయాలతో దూసుకెళుతోన్న మహేష్‌ ఈ సినిమాతో కూడా సక్సెస్ సాధిస్తాడని అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. మరి... మహేష్ - పరశురామ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనున్నారో చూడాలి. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ్యాపీ బర్త్ డే యంగ్ టైగర్ - కేరీర్‌ను మలుపుతిప్పిన 'సింహాద్రి' (video)