Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరు సిస్టర్ రోల్‌కి ఇద్దరు హీరోయిన్లు పోటీ? (video)

Webdunia
బుధవారం, 14 అక్టోబరు 2020 (13:05 IST)
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం తర్వాత తమిళ సూపర్ హిట్ మూవీ వేదాళంను తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. దీనికి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తతం ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. 
 
అయితే, ఈ ప్రాజెక్టు తెలుగులో చిరంజీవి చేయనున్నారనే వార్త లీకైనప్పటి నుంచి ఒక వార్త హల్చల్ చేస్తోంది. ఈ చిత్రంలో హీరో చెల్లి పాత్ర అత్యంత కీలకం. తమిళంలో హీరో అజిత్ చెల్లిగా లక్ష్మీ మీనన్ నటించి మెప్పించి, మంచి మార్కులు కొట్టేసింది. 
 
ఇపుడు తెలుగులో ఈ పాత్రలో ఎవరు నటిస్తారన్న అంశంపై తెగ చర్చ సాగుతోంది. ముఖ్యంగా, చిరంజీవి సోద‌రిగా సాయిప‌ల్ల‌వి న‌టించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా మ‌రో పేరు తైర‌పైకి వ‌చ్చింది. చిరు సిస్ట‌ర్ పాత్ర‌లో కీర్తిసురేశ్ పేరును కూడా మేక‌ర్స్ ప‌రిశీలిస్తున్నార‌ట‌. 
 
తమిళ వెర్షన్‌లో ల‌క్ష్మీ మీన‌న్ ప్రేక్ష‌కులను మెప్పించింది. దీంతో ల‌క్ష్మీమీన‌న్ రోల్‌లో అవార్డు విన్నింగ్ హీరోయిన్లైన సాయిప‌ల్ల‌వి, కీర్తిసురేశ్‌ల‌లో ఎవ‌రిని  చిరు అండ్ టీం ఎంపిక చేస్తార‌నేది తెలియాలంటే మ‌రికొన్ని రోజులు వెయిట్ చేయాలి. ప్రస్తుత ఈ చిత్రాన్ని నటీనటుల ఎంపికపై దర్శకుడు మెహర్ రమేష్ కసరత్తు చేస్తున్నారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మహా కుంభమేళాలో పవిత్ర స్నానమాచరించిన నారా లోకేష్ దంపతులు (Photos)

త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేసిన మంత్రి లోకేశ్ దంపతులు (Video)

ట్రాఫిక్ రద్దీ : పారాగ్లైడింగ్ ద్వారా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థి (Video)

గర్భం చేసింది ఎవరో తెలియదు.. పురిటి నొప్పులు భరించలేక 16 ఏళ్ల బాలిక మృతి

దూసుకొస్తున్న తుఫాను - పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments