రాఘవన్ సీక్వెల్‌లో అనుష్క.. గౌతమ్ మీనన్ కథ నచ్చిందట..!

Webdunia
మంగళవారం, 24 మార్చి 2020 (19:42 IST)
సినీ లెజెండ్ కమల్ హాసన్ నటించిన రాఘవన్ సినిమా తెలుగులో విడుదలై మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ రానుందని టాక్ వస్తోంది. కమల్‌హాసన్ ప్రస్తుతం ''ఇండియన్ 2'' చిత్రంలో నటిస్తున్నారు. ఇది పూర్తయిన తరువాతే ''రాఘవన్'' సీక్వెల్ ప్రారంభం కానుందని కోలీవుడ్ సమాచారం. గౌతమ్ మీనన్ తెరకెక్కించిన రాఘవన్ (తమిళంలో వేటైయాడు-విలైయాడు) సినిమా సీక్వెల్‌లో అనుష్క నటించనుందట. 
 
ఇంకా కథ నచ్చడంతో ఇందులో నటించేందుకు స్వీటీ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. అనుష్క తాజా చిత్రం నిశ్శబ్దం. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈ థ్రిల్లర్ చిత్రాన్ని కోన వెంకట్‌తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మించారు. ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా ఎఫెక్ట్ కారణంగా విడుదల వాయిదా పడింది. తాజాగా గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించే రాఘవన్ సీక్వెల్‌లో నటించే అవకాశం రావడంతో ప్రస్తుతం స్వీటీ ఫ్యాన్స్ ఎగిరి గంతేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టెక్కీ రాధా గాయత్రి మృతి కేసు : విచారణకు సహకరించాలని చెప్పా : శ్రీచరణ్ తండ్రి

హృద్రోగంతో చనిపోతే నీవు అనాథవు అవుతావు.. భార్యను హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న వృద్ధ భర్త

జూలై నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ ఖమేనీ అంత్యక్రియలు

వాష్ రూమ్‌లో ప్రసవించి వెంటిలేటర్ రంధ్రం నుంచి నవజాత శిశువును విసిరేసిన యువతి

బికారి అయిన వ్యక్తి మోజులో పడి కోటీశ్వరుడైన కాబోయే భర్తను హత్య చేసిన యువతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్యాస్ట్రిక్ సమస్య వున్నవారు సోంపు తినవచ్చా?

గుండె ఆరోగ్యానికి ఆరోగ్య సూత్రాలు

శరీర కొవ్వును కరిగించే రాగి దోసెలు

గర్భిణీ స్త్రీలు బీట్‌రూట్ తినవచ్చా లేదా?

ఈ అనారోగ్య సమస్యలు వున్నవారు మజ్జిగ తాగరాదు

తర్వాతి కథనం
Show comments