Webdunia - Bharat's app for daily news and videos

Install App

3 నిమిషాల పాటకు రూ.20 లక్షలు వసూలు చేస్తున్న అనసూయ

Webdunia
శనివారం, 30 జనవరి 2021 (17:22 IST)
బుల్లితెరపై యాంకర్‌గా రాణిస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటి అనసూయ భరద్వాజ్. ఈమె అపుడపుడూ వెండితెరపై కూడా కనిపిస్తోంది. రంగస్థలం చిత్రంల రంగమ్మత్తగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అలాగే, అడపాదడమా ఐటమ్ సాంగుల్లో కూడా నటిస్తోంది. ఈ క్రమంలో సాయిధరమ్ తేజ్ నటించిన విన్నర్ చిత్రంలో ‘సుయా సుయా అనసూయ’ పాటకు, విక్టరీ వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ నటించిన ‘ఎఫ్‌-2’లో ‘డింగు డాంగ్‌’ పాటపై మెరిసింది.
 
తాజాగా ‘చావు కబురు చల్ల’గా చిత్రంలోనూ ఐటెంసాంగ్‌ చేసేందుకు సమ్మతించింది. ఈ చిత్రంలో కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా నటిస్తుండగా.. కౌశిక్‌ దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే, మూడు నిమిషాల స్పెషల్‌ సాంగ్‌కు అనసూయకు రూ.20లక్షలు చెల్లిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.
 
చిత్ర కథ నేపథ్యంలో సాగే స్పెషల్‌ సాంగ్‌ ఎంతో కీలకంగా ఉంటుందని, ఈ మేరకు చిత్ర దర్శకుడు కౌశిక్,‌ అనసూయను ఒప్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సాంగ్ షూట్ హైదరాబాద్‌లో జరుగుతోంది. జానీ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరో వైపు అనసూయ ‘థాంక్స్ బ్రదర్’ చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. మొత్తంమీద అటు బుల్లితెర, ఇటు వెండితెరపై రాణిస్తూ రెండుచేతులా సంపాదిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ సమీపంలో అశోక్ లేలాండ్ బస్సు తయారీ ప్లాంట్‌ ప్రారంభం

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments