Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో "లూసిఫర్" రీమేక్... మెగాస్టార్‌తో స్టైలిష్ స్టార్

Webdunia
శుక్రవారం, 17 ఏప్రియల్ 2020 (14:33 IST)
మెగాస్టార్ చిరంజీవి మరో రీమేక్ చిత్రంలో నటించనున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన లూసిఫర్ చిత్రాన్ని ఆయన తెలుగులోకి రీమేక్ చేయనున్నారు. ఈ చిత్రం మోహన్ లాల్ సినీ కెరీర్‌లోనే ఓ మైలురాయి చిత్రంగా నిలిచిపోయింది. దీంతో చిరంజీవి కన్ను ఈ చిత్రం రీమేక్‌పై పడింది. దీంతో మలయాళ హక్కులను చిరంజీవి తనయుడు హీరో కమ్ నిర్మాత రాంచరణ్ భారీ మొత్తానికే కొనుగోలు చేశారు.
 
ప్రస్తుతం చిరంజీవి ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం. కరోనా వైరస్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం షూటింగ్ పూర్తి  చేసిన తర్వాత లూసిఫర్ రీమేక్‌పై చిరంజీవి దృష్టిసారించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
అయితే, ఈ చిత్రంలో అత్యంత కీలకమైన ఓ పాత్రలో అంటే చిరంజీవికి నమ్మినబంటుగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ పాత్రను అల్లు అర్జున్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని చిరంజీవి వ్యక్తం చేశారట. అల్లు అర్జున్ కూడా ఆ పాత్ర పట్ల ఆసక్తిని చూపుతున్నాడనే టాక్ బలంగా వినిపిస్తోంది. 
 
కాగా, 'లూసిఫర్' సినిమాలో మోహన్ లాల్‌కి నమ్మిన బంటుగా జాయేద్ మసూద్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటించాడు. ఆ పాత్ర ఆయనకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments