గంగదేవిపాడులో వైఎస్. షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్ష

Webdunia
మంగళవారం, 20 జులై 2021 (14:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్తగా రాజకీయ పార్టీని స్థాపించిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల ఆ రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలబడ్డారు. ఇందులోభాగంగా, ఆమె ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. ఇందులోభాగంగా, 20వ తేదీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష చేపట్టనున్నారు. 
 
ఖమ్మంలో పర్యటిస్తున్న షర్మిల పెనుబల్లి మండలంలోని గంగదేవిపాడులో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. కష్టపడి చదివినా ఉద్యోగం రాకపోవడంతో నాగేశ్వరరావు ఆత్మహత్యకు పాల్పడ్డాడని షర్మిల ముందు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మనో ధైర్యం కోల్పోవద్దని కుటుంబానికి అండగా ఉంటానని షర్మిల హమీ ఇచ్చారు.
 
కాగా, ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి 10 జిల్లాల నుంచి నిరుద్యోగులు, విద్యార్థులు, యువకులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

Yamini Bhaskar: ఆయన దాదాపు 15 నిమిషాలు నాతో మాట్లాడారు : యామిని భాస్కర్

బ్యాడ్ బాయ్ కార్తీక్ నుంచి నాగ శౌర్య, శ్రీదేవి విజయ్ కుమార్ ఎమోషనల్ సాంగ్

హార్ట్‌ వీక్‌గా ఉన్నవాళ్లు ఈషా సినిమా చూడొద్దు : బన్నీ వాస్‌, వంశీ నందిపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments