Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు... వైఎస్. షర్మిల

పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరు... వైఎస్. షర్మిల
, శుక్రవారం, 16 జులై 2021 (14:02 IST)
పుట్టింటి మీద అలిగి ఏ ఒక్కరూ రాజకీయ పార్టీలు పెట్టరని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్.షర్మిల వ్యాఖ్యానించారు. దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖ‌ర్‌ రెడ్డి తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె స్పష్టం చేశారు. 
 
ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, వైఎస్‌ తెలంగాణకు మంచి చేశారా.. ద్రోహం చేశారా అనే విషయాన్ని గ్రామాలకు వెళ్లి అడగాలని అన్నారు. వైఎస్‌ చనిపోయాకే తెలంగాణ మలిదశ ఉద్యమం మొదలైందని విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నారు. 
 
ప్రత్యేక తెలంగాణ అవసరం అని 41 మంది ఎమ్మెల్యేలతో కలిసి చెప్పారని గుర్తు చేసిన షర్మిల, యూపీఏ మ్యానిఫెస్టోలో కూడా తెలంగాణ ఏర్పాటు అంశం చేర్చారని తెలిపారు. తన తండ్రి ప్రేమించిన తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రజల కోసం నిలబడే.. పోరాడే పార్టీ వైఎస్సార్‌ టీపీ అని స్పష్టం చేశారు.  
 
అలాగే, పుట్టింటి మీద అలిగితే పార్టీలు పెట్టరని షర్మిల వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఆశయ సాధన కోసం ఈ పార్టీ స్థాపించామన్నారు. కృష్ణా జలాల అంశాలను కేసీఆర్‌ ఏనాడైనా సీరియస్‌గా తీసుకున్నారా అని ప్రశ్నించారు. 
 
తెలంగాణకు దక్కాల్సిన చుక్క నీటిబొట్టును వదులుకోమని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌లో ఎంత మంది మహిళలున్నారని.. మీటింగ్‌ జరిగితే మహిళా సర్పంచ్‌కు కూడా కుర్చీ ఇవ్వరని విమర్శించారు. కేసీఆర్ దృష్టిలో మహిళలంటే వంటింట్లో ఉండాలని, వ్రతాలు చేసుకోవాలి షర్మిల అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బెంగుళూరులో విదేశీయుల ఇళ్ళలో సీసీబీ మెరుపు సోదాలు