Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమ్మాయిల వేధింపులు.. పురుగుల మందు తాగిన ల్యాబ్ టెక్నీషియన్

Webdunia
గురువారం, 19 ఆగస్టు 2021 (09:51 IST)
సాధారణంగా యువకుల వేధింపులు భరించలేక అమ్మాయిలు అత్మహత్యలు చేసుకోవడం సహజం. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అయింది. అమ్మాయిల వేధింపులు భరించలేని ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మొరిపిరాలకు చెందిన సందీప్ మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి ముగ్గురు అమ్మాయిలతో పరిచయం అయింది. అందులో ఒకరిపై సందీప్ ప్రేమలో పడ్డాడు.
 
ఇటీవల మిగతా ఇద్దరు యువతులు సందీప్‌కు ఫోన్ చేసి ప్రియురాలు చనిపోయిందని, అందుకు కారణం నువ్వేనంటూ బెదిరించారు. ఈ నెల 12వ తేదీన మరోమారు ఫోన్ చేసిన యువతులు సందీప్‌ను బెదిరించారు. 
 
దీంతో భయపడిపోయిన యువకుడు స్వగ్రామానికి చేరుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments