Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి శ్రీనగర్ కాలనీలో అందమైన అమ్మాయిలు అంటూ...

తిరుపతి శ్రీనగర్ కాలనీలో అందమైన అమ్మాయిలు అంటూ...
, బుధవారం, 21 జులై 2021 (21:45 IST)
ఆధ్మాత్మిక క్షేత్రం తిరుపతి పట్టణంలో గుట్టుగా సాగుతున్న హైటెక్ వ్యభిచార దందా గుట్టును రట్టు చేశారు పోలీసులు. తిరుపతి శ్రీనగర్ కాలనీలో రహస్యంగా సాగుతున్న దందాను వెలుగులోకి తెచ్చారు. వాట్సాప్ ద్వారా విఠులను ఆకర్షించి జోరుగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.
 
ఒక ఇంట్లో ఆకస్మికంగా దాడి చేసి నలుగురు విఠులు, నిర్వాహకులను అరెస్టు చేసినట్లు తిరుపతి పోలీసులు వెల్లడించారు. పోలీసుల విచారణలో నిజాలు బయటకు వచ్చాయి. ఈ వ్యభిచార దందా నిర్వహిస్తోంది ఇద్దరు మహిళలని తేల్చారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారికి చెందిన స్వప్న, లక్ష్మీప్రియగా గుర్తించారు. 
 
యువతుల ఫోటోలను సాయిచరణ్, అనిరిథ్ కుమార్ అనే ఇద్దరికి పంపినట్లు గుర్తించారు. బెంగుళూరు, గుడివాడ నుంచి యువతులను రప్పించి విటులు కోరుకున్న ప్రాంతానికి తీసుకెళ్ళి ఎంజాయ్ చేసేవారు. ఇదంతా చాలా రహస్యంగా సాగుతోంది. ముందుగా వాట్సాప్ ద్వారా వ్యాపారం మొత్తం జరుగుతుంది.
 
బేరసారాలన్నీ వాట్సాప్ లోనే ఉంటాయి. డబ్బులు మొదట్లో చాలా తక్కువగా చెబుతున్నారు. ఒక్కొక్క అమ్మాయి ఫోటోను వాట్సాప్ ద్వారా పంపిస్తారు. ఇలా తక్కువ రేటని చెబుతూనే ఎక్కువ రేట్లు ఉన్న అమ్మాయి కూడా ఉందని మరింత అందంగా ఉన్న ఫోటోలను చూపిస్తారు. 
 
ఇదంతా బేరసారాలు ముగిసిన తరువాత అడ్వాన్స్ వేయించుకుంటారు. ఇలా గత కొన్నిరోజులుగా తిరుపతి నగరంలోనే ఈ మొత్తం వ్యవహారం సాగుతోంది. ఎంతో రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు ఛేదించారు. ఐదుగురు యువతులు, ఇద్దరు నిర్వాహకులు, ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. నిర్వాహకులపై కేసులు పెట్టి యువతులకు కౌన్సిలింగ్ ఇచ్చి పంపేశారు పోలీసులు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద