Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్రమ సంబంధం ఉన్న యువతిని లేపుకెళ్లిన యువకుడు.. పట్టుకుని చంపేశారు...

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (15:37 IST)
హైదరాబాద్ నగరంలో మరో వివాహేతర హత్య జరిగింది. ఓ యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు ఓ యువకుడుని పట్టుకుని బంధించారు.  ఆ తర్వాత చిత్రహింసలు పెట్టి హతమార్చి, మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ హత్య కేసు వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ నగరంలోని అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన శ్రీకాంత్‌ రెడ్డి అనే యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. శ్రీకాంత్‌ రెడ్డిని చంపి కనకరాజ్ అనే వ్యాపారి శ్మశానవాటికలో పూడ్చిపెట్టాడు. 
 
నిందితుడు కనకరాజ్‌ను రాచకొండ ఎస్వోటీ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. స్మశాన వాటికలోనే శ్రీకాంత్‌ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. కనకరాజ్‌తో వివాహేతర సంబంధమున్న యువతిని శ్రీకాంత్‌ రెడ్డి తీసుకు వెళ్లడంతో ఇద్దరి మధ్య వివాదం నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో ఇద్దరిని తీసుకొచ్చిన కనకరాజ్.. జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో బంధించాడు. 10 రోజుల పాటు శ్రీకాంత్‌రెడ్డిని హింసించి హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Khaleja: ఖలేజా రీ-రిలీజ్- మొదటి రోజే రూ.8కోట్లు.. ఆల్ టైమ్ రికార్డ్ నమోదు

NBK: బాలక్రిష్ణ పుట్టినరోజున అఖండ2 అప్ డేట్ రాబోతోంది

Rajendra Prasad: తన ఒరిజినల్ గెటప్ ఇదే అంటున్న రాజేంద్రప్రసాద్

Nikhil: నిఖిల్ కత్తి యోధుడిలా సంయుక్త విల్లు బాణంతో స్వయంభు లో యాక్షన్ సీన్

Sudheer: కృష్ణ కు నివాళితో జటాధర చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప్రారంభించిన సుధీర్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments