Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆకలితో చస్తుంటే.. రూ.వెయ్యి కోట్లతో పార్లమెంట్ భవనం అవసరమా?

Webdunia
ఆదివారం, 13 డిశెంబరు 2020 (14:26 IST)
కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం రూ.1000 కోట్లు ఖర్చు చేయనుంది. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఒకవైపు, కరోనా వైరస్ లాక్డౌన్ కారణంగా వ్యవస్థలన్నీ స్తంభించిపోయాయి. లాక్డౌన్ అన్‌లాక్ తర్వాత ఇపుడిపుడే కుదుటపడుతున్నాయి. లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. అనేక మంది ఆకలితో అలమటిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఉపాధి లేక తల్లడిల్లిపోతున్నారు. ఉపాధి కల్పోయిన అనేక కుటుంబాలు జీవనం సాగించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. 
 
ఈ క్రమంలో రూ.వెయ్యి కోట్లతో కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనాన్ని నిర్మించనుంది. ఇందుకోసం ఈ నెల పదో తేదీన ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ కూడా చేశారు. సెంట్రల్ విస్టా పేరుతో కేంద్రం నూతన పార్లమెంటు సముదాయ నిర్మాణాన్ని చేపట్టనున్నారు. దీనిపై మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ విమర్శలు గుప్పించారు.  
 
కరోనా దెబ్బకు దేశంలో సగం మంది ఉపాధి కోల్పోయి ఆకలితో అల్లాడుతుంటే, ఎవరైనా రూ.1000 కోట్లతో పార్లమెంటు భవనం కడతారా? అంటూ మండిపడ్డారు. చైనాలో గ్రేట్ వాల్ నిర్మాణ సమయంలో వేలమంది ప్రజలు చనిపోయారని, అయితే ఆ గోడ నిర్మిస్తోంది ప్రజలను రక్షించడానికేనని అప్పటి రాజులు చెప్పారని కమల్ ప్రస్తావించారు. ఇప్పటి భారత పాలకుల తీరు కూడా అలాగే ఉందని విమర్శించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

తర్వాతి కథనం
Show comments