Webdunia - Bharat's app for daily news and videos

Install App

హిమాయ‌త్‌సాగ‌ర్‌లో మహిళపై సామూహిక అత్యాచారం..

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (15:19 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతూనే వున్నాయి. వయోబేధాలు లేకుండా ఎక్కడపడితే అక్కడ అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా హైదరాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని హిమాయ‌త్‌సాగ‌ర్‌లో బుధ‌వారం రాత్రి దారుణం జ‌రిగింది. 
 
పోలీసు అకాడ‌మీ వ‌ద్ద వేచి ఉన్న ఓ మ‌హిళ‌ను ఆటోలో వ‌చ్చిన ముగ్గురు వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు. అనంత‌రం ఆమెను హిమాయ‌త్ సాగ‌ర్‌కు సమీపంలో నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ త‌ర్వాత మ‌హిళ వ‌ద్ద ఉన్న న‌గ‌దు, బంగారు ఆభ‌ర‌ణాల‌ను దొంగిలించి రోడ్డుపైన వ‌దిలేసి వెళ్లిపోయారు. 
 
ఈ ఘటనపై బాధితురాలు రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. పోలీసు అకాడ‌మీ నుంచి హిమాయ‌త్ సాగ‌ర్ వ‌ర‌కు ఉన్న సీసీటీవీ ఫుటేజీల‌ను పోలీసులు ప‌రిశీలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments