Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్య.. ఎక్కడంటే?

Webdunia
సోమవారం, 1 ఆగస్టు 2022 (10:15 IST)
వేద మంత్రాల సాక్షిగా మనువాడిన భర్తను ప్రియుడితో హత్య చేయించింది ఓ కిరాతక భార్య. తన వివాహేతర సంబంధం కొనసాగించడానికి భర్తను పొట్టనబెట్టుకుంది. అయితే పోలీసు విచారణలో ఈ విషయం వెల్లడి కావడంతో భర్తను హత్య చేసిన భార్య, ఆమె ప్రియుడు అరెస్టయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే.. కామారెడ్డి జిల్లా బిచ్కుందకు చెందిన బోధన్ హనుమబోయి అనే వ్యక్తికి అనురాధతో చాలా సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అనురాధ ఉంటున్న కాలనీలోనే ఉంటున్న పోష బోయితో వ్యక్తితో కొన్నేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. 
 
తనకు తన ప్రియుడికి మధ్యలో భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన అనురాధ ఎలాగైనా అతడి అడ్డు తొలగించుకొని ఇద్దరూ శాశ్వతంగా కలిసి ఉండాలని భావించారు. ఇందులో భాగంగానే ప్రియుడికి భర్తను హత్య చేసే పనిని అప్పగించింది. ఇక హనుమబోయికి బాగా మద్యం తాగించి అతను మత్తులోకి జారుకోగానే తాడుతో గొంతుకు ముడివేసి హత్య చేశారు పోష బోయితో పాటు అతని స్నేహితులు. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో తానే ప్రియుడితో కలిసి జీవించాలని భర్తను హత్య చేయించానని ఒప్పుకుంది. దీంతో పోలీసులు అనురాధతో పాటు ఆమె ప్రియుడు పోష బోయి, రమేష్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments