Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థులతో షర్మిల భేటీ ఎందుకబ్బా?

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (08:48 IST)
తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో బుధవారం వైఎస్‌ షర్మిల సమావేశం కానున్నారు. లోట్‌సపాండ్‌లో జరగనున్న ఈ సమావేశంలో సుమారు 350 మంది విద్యార్థులు పాల్గొంటున్నట్లు షర్మిల బృందం వెల్లడించింది.

విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఫీజు రీయింబర్స్‌మెంటు పథకం అమలు తీరు తదితర అంశాలపైన విద్యార్థుల అభిప్రాయాలను ఆమె స్వీకరిస్తారు. కాగా, మంగళవారం ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ నుంచి పలువురు అభిమానులు వచ్చి షర్మిలను కలిశారు. జనగామ మునిసిపాలిటీ మాజీ చైర్మన్‌ సుధాకర్‌, మాజీ ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి కూడా షర్మిలను కలిసి, కాసేపు మాట్లాడారు.
 
కొత్తగా పార్టీ పెట్టబోతున్న వైఎస్‌ షర్మిలకు మద్దతు తెలిపేందుకు మాజీ మంత్రి ప్రభాకర్‌రెడ్డి ముందుకొచ్చారు. ఇటీవలే షర్మిలను కలిసి సంఘీభావం తెలిపిన మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి.. మంగళవారం ప్రభాకర్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు.

షర్మిల సన్నిహిత బంధువు ఒకరు ఆయనతో పాటు ప్రభాకర్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా షర్మిలకు మద్దతు తెలిపేందుకు, అవసరమైన సహకారాన్ని అందించేందుకు ప్రభాకర్‌రెడ్డి అంగీకరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరోయిన్ శ్రీలీలకు మెగాస్టార్ చిరంజీవి అరుదైన బహుమతి!!

దిల్ రూబా లో సరికొత్త ప్రేమ కథను చూస్తారు - దర్శకుడు విశ్వ కరుణ్

Vijayashanti: కళ్యాణ్ రామ్, విజయశాంతి మూవీ టైటిల్ అర్జున్ S/O వైజయంతి

Rukshar Dhillon: హాపీ ఉమన్స్ డే గా నటి రుక్సార్ ధిల్లాన్ ఘాటు విమర్శలు

దర్శకులు మెచ్చుకున్న 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో చిత్రం.. ఫుల్ ఫన్ రైడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

Tandoori Chicken Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ తందూరి చికెన్ ఈజీగా ఎలా చేయాలి?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments