Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూల వాగుపై వంతెన మళ్లీ కూలింది...

Webdunia
మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (13:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా వేములవాడలో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలింది. 
 
గతంలో ఓసారి వరద దాటికి కొట్టుకుపోయినా తాజాగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే తాజాగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన మళ్లీ కొట్టుకుపోవటంతో నాణ్యతపై అనుమానాలొస్తున్నాయి. కమిషన్ల కక్కుర్తికి ఇదే సాక్ష్యం అంటూ స్థానికులు మండిపడుతున్నారు.
 
ఈ జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మూల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి భక్తులకు గుడికి వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు దారులుండాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం 28 కోట్ల రూపాయల వ్యయంతో ఐదు సంవత్సరాల క్రితం ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభించారు. 
 
కానీ పనులు నత్తనడక సాగుతుండటం, వర్షాకాలంలో వాగు ప్రవహించటంతో పనులు ఆలస్యం అవుతూ వచ్చాయి. ఇపుడు నిర్మాణంలో ఉన్న వంతెన మళ్లీ కూలడంతో ఈ పనులు మరింత ఆలస్యం కానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మీరు విలన్‌గా చేస్తే మొదటి సీన్‌లోనే మమ్మల్ని కాల్చి చంపేస్తా?

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments