Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరెన్సీ నోట్లను ముక్కలు చేసిన ఎలుకలు.. అండగా నిలిచి మంత్రి సత్యవతి

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (17:31 IST)
తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లా వేమునూరు పంచాయతీ పరిధిలోని ఇందిరానగర్ తండాకు చెందిన భూక్య రెడ్యా అనే రైతు కడుపులో కణితి ఆపరేషన్ కోసం బీరువాలో దారుచుకున్న రూ.2 లక్షల కరెన్నీ నోట్లను ఎలుకలు ముక్కలు ముక్కలుగా కొరికేశాయి. 
 
ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. చికిత్స కోసం దాచుకున్న నగదును ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఏం చేయాలో దిక్కుతోచని మహబూబాబాద్ రైతు రెడ్యాకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అండ‌గా నిలిచారు. రెడ్యాకు మంత్రి స‌త్య‌వ‌తి ఫోన్ చేసి మాట్లాడారు.
 
రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తాన‌ని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం అందిస్తామ‌ని మంత్రి సత్యవతి రాథోడ్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆదివారం ఉదయం ఎమ్మార్వో రంజిత్‌ని రైతు రెడ్యా దగ్గరకు పంపించి, ధైర్యం చెప్పారు. రెడ్యా డబ్బుల విషయంలో గాని, చికిత్స విషయంలో గాని ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కాగా మంత్రి హామీతో రైతు రెడ్యా సంతోషం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments