19న ఛలో తాడేపల్లి - రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు

Webdunia
ఆదివారం, 18 జులై 2021 (17:07 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగులు తీవ్ర ఆందోళనలు, నిరసనలకు దిగుతున్నారు. ఈ జాబ్ క్యాలెండర్‌ను సవరించాలని కోరుతూ రాష్ట్ర విద్యార్థి, నిరుద్యోగ సంఘాలు కొన్నిరోజులుగా ఆందోళనలు చేస్తున్నాయి. 
 
ఈ క్రమంలో ఈ నెల 19వ తేదీ సోమవారం 'ఛలో తాడేపల్లి' కార్యాచరణకు పిలుపునిచ్చాయి. అయితే సీఎం జగన్ నివాసం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, 'ఛలో తాడేపల్లి'కి అనుమతిలేదని గుంటూరు ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ స్పష్టం చేశారు. 
 
విద్యార్థులు తమ భవిష్యత్తు చూసుకుంటే బాగుంటుందని ఆయన కాస్తంత హెచ్చరిక ధోరణిలో వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరదీశారు. మరోవైపు, ముఖ్యమంత్రి నివాసం ముట్టడికి వెళతారన్న సమాచారం నేపథ్యంలో ఎక్కడికక్కడ ముందుగానే అడ్డుకుంటున్నారు. 
 
తాజాగా, అనంతపురంలో టీడీపీ యువనేత జేసీ పవన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందంటూ పవన్ రెడ్డి టీడీపీ కార్యకర్తలతో తన నివాసంలో ఇవాళ నిరసనలు చేపట్టారు. 
 
ఈ నిరసనలను అడ్డుకున్న పోలీసులు పవన్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అలాగే, రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ముందస్తు అరెస్టుల పరంపర కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మద్రాస్ నా జన్మభూమి, తెలంగాణ నా కర్మభూమి, ఆంద్ర నా ఆత్మభూమి: అఖండ 2 ప్రెస్ మీట్లో బాలయ్య

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

శీతాకాలంలో మహిళలు మునగాకు సూప్‌ను వారానికి రెండుసార్లైనా...?

తర్వాతి కథనం
Show comments