Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం కేసీఆర్... మూడు రోజుల పాటు హస్తినలో మకాం?

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:56 IST)
తెరాస అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో ఢిల్లీ వెళ్ళనున్నారు. ఈ పర్యటనలో ఆయన మూడు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నట్టు తెలుస్తుంది. 
 
తన నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిందని, ఇపుడు బంగారు భారత్ చేయాలన్న పట్టుదలతో జాతీయ రాజకీయాల్లోకి రానున్నట్టు సీఎం కేసీఆర్ పదేపదే ప్రకటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఇప్పటికే పలువురు విపక్ష నేతలను కలుసుకుంటూ వస్తున్నారు. 
 
ఇప్పటికే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీలతో సమావేశమయ్యారు. ఇపుడు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఇందుకోసం ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పైగా, సీఎం కేసీఆర్ వెంట సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఉండటం గమనార్హం. అలాగే, తన ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్‌ను సీఎం కేసీఆర్ నియమించుకున్నారు. ఇది హాట్ టాపిక్‌గా మారింది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments