Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలు.. తొలి విడత పోలింగ్ ప్రారంభం

Webdunia
సోమవారం, 28 ఫిబ్రవరి 2022 (12:42 IST)
మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. మణిపూర్‌లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా, తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్ర‌మంలో మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. వీరిలో 15 మంది మహిళా అభ్యర్థులు ఎన్నిక‌ల బ‌రిలో దిగుతున్నారు.
 
మణిపూర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇందులో భాగంగా తొలి విడత పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ రోజు ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. 
 
నిజానికి ఆదివార‌మే యూపీ ఐదో ద‌శ ఎన్నిక‌ల‌తో పాటు మ‌ణిపూర్‌లో తొలి ద‌శ ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే పోలింగ్ ఏర్పాట్ల‌లో జ‌రిగిన అంత‌రాయం కార‌ణంగా ఈ ఎన్నికలు ఈరోజుకి వాయిదా పడింది. 
 
మ‌ణిపూర్‌లో రెండో విడత పోలింగ్ మార్చి 5వ తేదీన జరగనుంది. రెండో విడతలో మిగిలిన 22 స్థానాలకు పోలింగ్‌ను నిర్వహిస్తారు. ఇక‌పోతే మార్చి 10వ తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్‌తో కలిసి నటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా : మాళవిక మోహనన్

Naveen Chandra: డాక్టర్స్ ప్రేమ కథ గా 28°C, చాలా థ్రిల్లింగ్ అంశాలున్నాయి : నవీన్ చంద్ర

Samantha: సమంత రూత్ ప్రభు రహస్యంగా నిశ్చితార్థం చేసుకుందా?

Keeravani : షష్టిపూర్తి లో కీరవాణి రాసిన పాటని విడుదల చేసిన దేవి శ్రీ ప్రసాద్

Pawan Kalyan: మార్షల్ ఆర్ట్స్ గురువు షిహాన్ హుస్సైనీ మరణం ఆవేదనకరం : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments