Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండటం దురదృష్టకరం : మంత్రి కేటీఆర్

Webdunia
శనివారం, 12 మార్చి 2022 (16:27 IST)
తెలంగాణా రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి వంటి నేత కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టకరమని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆయన శనివారం జరిగిన సభలో పాల్గొని కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు. 
 
హైదరాబాద్ నగరానికి కేంద్రం ఇప్పటివరకు వరద సాయం అందించలేదన్నారు. హైదరాబాద్‌కు చెందిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మనసు రావడం లేదన్నారు. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందన్నారు. 
 
ఇదేసమయంలో కంటోన్మెంటో అధికారులపై ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తాము చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. వాల్లు రోడ్లు బంద్ చేస్తే తాము కరెంట్, నీళ్లు కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. 
 
కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తానని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట వినకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరిస్తుందని ఆయన స్పష్టం చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pavitra Lokesh: నరేష్- పవిత్రకు స్వీట్లు ఇచ్చిన మహిళ.. పవిత్రకు ఆ ఇద్దరంటే చాలా ఇష్టమట

Trisha: థగ్ లైఫ్ నుండి త్రిష పాడిన షుగర్ బేబీ సాంగ్ విడుదల

ఒక బృందావనం ఫీల్‌గుడ్‌ అనుభూతి కలుగుతుంది: హీరో నారా రోహిత్‌

మోహన్ లాల్ పుట్టినరోజు సందర్భంగా కన్నప్ప స్పెషల్ గ్లింప్స్

Akanksha : షూటింగ్ చేస్తున్నప్పుడు నా తండ్రి గుర్తుకు వచ్చారు : హీరోయిన్ ఆకాంక్ష సింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments