రైలు కింద పడి 300 గొర్రెలు మృత్యువాత.. రూ.18లక్షల నష్టం

Webdunia
గురువారం, 17 జూన్ 2021 (10:06 IST)
రైలు కింద పడి 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నిజామాబాద్‌ జిల్లాలో గొర్రెల మంద పైనుంచి రైలు దూసుకెళ్లడంతో సుమారు 300 మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. నవీన్‌పేట మండలం కోస్గీ వద్ద గురువారం ఉదయం ఈ దుర్ఘటన జరిగింది.

కాపరి గొర్రెలను మేపుతుండగా మందంతా ఒక్కసారిగా పట్టాలపైకి వచ్చింది. అదే సమయంలో రైలు వాయువేగంతో దూసుకువచ్చి ఢీకొట్టడంతో గొర్రెలు చెల్లాచెదురయ్యాయి. 
 
సుమారు రూ. 18 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు వాపోయాడు. ఊహించని ప్రమాదంలో గొర్రెలన్నీ మృత్యువాతపడటంతో రైతు కుటుంబం ఘటనాస్థలంలో కన్నీరుమున్నీరైంది. బాధిత రైతును ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టీనేజ్ నాగార్జున అంటే పిచ్చి ప్రేమ : నటి కస్తూరి

బాలీవుడ్ బిగ్ బికి భద్రత పెంపు : కేంద్రం కీలక నిర్ణయం

RP Patnaik: బాపు సినిమా అవకాశం రాకపోయినా ఆ కోరిక తీరింది : ఆర్.పి పట్నాయక్

Prashanth Varma:, ప్రశాంత్ వర్మ నిర్మాతలను మోసం చేశాడా? డివివి దానయ్య ఏమంటున్నాడు?

భయపెట్టేలా రాజేష్ ధ్రువ... సస్పెన్స్, థ్రిల్లర్.. పీటర్ టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments