Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు : వివాదం - ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రజలను నియంత్రించారు. 
 
బోధన్‌లో శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మైనార్టీ నేతలు బైఠాయించి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలను కూడా మొహరించారు. ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసి, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

Rasool : స్కై సినిమా నుంచి జర్నీఆఫ్ ఎమోషనల్ స్కై టీజర్ లాంఛ్

Chiru: 25 ఏళ్ళ తర్వాత మెగాస్టార్ చిరంజీవి సంతకం తీసుకున్న శేఖర్ కమ్ముల

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments