బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటు : వివాదం - ఉద్రిక్తత

Webdunia
ఆదివారం, 20 మార్చి 2022 (17:18 IST)
తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా బోధన్‌లో శివాజీ విగ్రహం ఏర్పాటుతో వివాదం తలెత్తింది. దీంతో ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాల ప్రజలను నియంత్రించారు. 
 
బోధన్‌లో శివసేన, బీజేపీ కార్యకర్తలు రాత్రికిరాత్రి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. ఈ విషయం తెలుసుకున్న మైనార్టీ నాయకులు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు. శివాజీ విగ్రహం ఏర్పాటు చేసిన మైనార్టీ నేతలు బైఠాయించి విగ్రహాన్ని తొలగించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసులు అక్కడకు చేరుకుని వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు. 
 
అయితే, అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇరు వర్గాల ప్రజలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులపైకి కూడా రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితి చేయిదాటిపోతుందని భావించిన పోలీసులు తొలుత టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆ తర్వాత నిజామాబాద్ పోలీసు కమిషనర్ తక్షణం ఘటనా స్థలానికి చేరుకుని పోలీసు బలగాలను కూడా మొహరించారు. ప్రస్తుతం బోధన్‌లో 144 సెక్షన్‌ను అమలు చేసి, ప్రజలు గుమికూడకుండా చర్యలు తీసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తపై గృహహింస - క్రూరత్వం - మోసం కేసు పెట్టిన బాలీవుడ్ నటి

రెజ్లింగ్ క్లబ్ నేపథ్యంలో చఠా పచా – రింగ్ ఆఫ్ రౌడీస్ రాబోతోంది

Naveen Plishetty: అనగనగ ఒకరాజు నుండి భీమవరం బాల్మా మొదటి సింగిల్ అప్ డేట్

Anantha Sriram: గీత రచయిత కష్టం తెలిసినవారు ఇండస్ట్రీలో కొద్దిమందే : అనంత శ్రీరామ్

అవతార్: ఫైర్ అండ్ ఆష్ ప్రీ-రిలీజ్ క్రేజ్ స్కైరాకెట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

తర్వాతి కథనం
Show comments