Webdunia - Bharat's app for daily news and videos

Install App

పని ఉందంటూ తీసుకెళ్లి హత్యాచారం - ఇద్దరు వ్యక్తుల దుర్మార్గం

Webdunia
గురువారం, 9 జూన్ 2022 (07:55 IST)
తెలంగాణా రాష్ట్రంలో కామాంధులు రెచ్చిపోతున్నారు. వరుస అత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. తాజాగా ఓ మహిళను పని ఉందని చెప్పి తీసుకెళ్లిన ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. ఆ తర్వాత తలపై బండరాయితో కొట్టి చంపేశారు. ఈ దారుణం శంషాబాద్ మండల పరిధిలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, మదనపల్లి కొత్త తండాకు చెందిన ఓ మహిళ(40) దినసరి కూలీ. రోజులాగానే బుధవారం ఉదయం శంషాబాద్‌లోని అడ్డా దగ్గర నిలబడింది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు పని ఉందంటూ ఆమెను పిలిచారు. ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని కవ్వగూడ వ్యవసాయ పొలాల్లోని నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. 
 
ఆ తర్వాత బండరాయితో తలపై మోది పరారయ్యారు. రక్తపు మడుగులో కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న బాధితురాలిని స్థానిక రైతులు గమనించి 100కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృత్యువాత పడిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sushant: సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం హత్య కాదు.. ఆత్మహత్య.. కేసును క్లోజ్ చేసిన సీబీఐ

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

తర్వాతి కథనం
Show comments