Publish Date: Wed, 08 Jun 2022 (17:47 IST)
Updated Date: Wed, 08 Jun 2022 (17:49 IST)
హైదరాబాద్ నగరంలోని ప్రముఖ చారిత్మాత్మక కట్టడమైన చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ఆలయం వద్ద ఆయన ప్రత్యేక పూజలు చేస్తారు.
ఢిల్లీ వేదికగా బీజేపీ కార్పొరేటర్ల సదస్సు జరిగింది. ఇందులో ప్రధాని మోడీ సైతం పాల్గొన్నారు. ఈ సంద్భంగా ఆయన పార్టీ బలోపేతానికి, ప్రజా సమస్య పరిష్కారానికి ప్రతి ఒక్క కార్పొరేటర్ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అయితే, హైదరాబాద్ నగరానికి చెందిన కార్పొరేటర్లు ప్రధానికి ఓ వినతి చేశారు. చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించాలని ఆయన కోరారు. ఎమ్మెల్యే టిక్కెట్లు సాధించుకోవాలనే కలను నెరవేర్చుకునేందుకు కృషి చేయాలని కార్పొరేటర్లను ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.
దీంతో వచ్చే నెల 2వ తేదీన హైదరాబాద్ నగరానికి వచ్చే ప్రధాని మోడీ ఆయన భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. మోడీ చేసిన సూచనలు కార్పొరేటర్లలో ఉత్సాహాన్ని పెంచాయి. ప్రధాని హైదరాబాద్ పర్యటన పనులకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు ఇప్పటి నుంచే ప్రారంభించారు.