తెలంగాణలో 2వేలకు చేరిన కరోనా కేసులు.. దేశంలోనూ విలయతాండవం

Webdunia
బుధవారం, 7 ఏప్రియల్ 2021 (10:25 IST)
తెలంగాణలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మొన్నటి వరకు వేయిలోపే నమోదవుతున్న కేసులు ఇవాళ 2వేలకు చేరువలో నమోదయ్యాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1914 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,16,649కి చేరింది. 
 
ఇందులో 3,03,298 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 11,617 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. కరోనా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో ఐదుగురు కరోనాతో మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1734కి చేరింది. కరోనా బులెటిన్ ప్రకారం మంగళవారం 285 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
 
అలాగే భారత్‌లో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. మరోసారి రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24గంటల్లో 12,08,329 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా.. 1,15,736 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1.28కోట్లకు చేరింది. నిన్న ఒక్క రోజే 630 మంది ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments