తెలంగాణాలో చాపకింద నీరులా కరోనా వైరస్ వ్యాప్తి

Webdunia
శుక్రవారం, 17 జూన్ 2022 (15:40 IST)
తెలంగాణా రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చాపకింద నీరులా వ్యాప్తిస్తుంది. ఆ రాష్ట్రంలో రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు నానాటికీ పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 28424 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, వీరిలో 285మందికి ఈ వైరస్ సోకినట్టు తేలింది. వీటిలో అత్యధికంగా 188 మందికి ఈ వైరస్ బారినపడ్డారు. 
 
ఇందులో రంగారెడ్డిలో 54, మేడ్చల్‌ మల్కాగిరి జిల్లాలో 16 కేసుల చొప్పున నమోదయ్యాయి. అయితే, ప్రజలకు, ప్రభుత్వానికి ఊరట కలిగించే అంశాలేమిటంటే కరోనా మరణాలు లేకపోవడం గమనార్హం. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 
 
ఈ యేడాది ఫిబ్రవరి తర్వాత కేసుల సంఖ్య 285 దాటడం ఇదే తొలిసారి. ఈ నెల 13న 126 కరోనా కేసులు రాగా, 14న ఒక్కసారిగా డబుల్ సెంచరీ మార్కుని(219) అందుకున్నాయి. ఈ నెల 15న 205 కరోనా కేసులు వచ్చాయి. తాజాగా 300లకు చేరువగా కొవిడ్ కేసులు నమోదవడం టెన్షన్ పెడుతోంది.
 
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. ఫోర్త్ వేవ్ భయాలను తలుచుకుని ప్రజలు వణికిపోతున్నారు. కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచిస్తున్నారు. మాస్కు ధరించాలని, భౌతికదూరం పాటించాలని చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ప్రభాస్ స్పిరిట్ మూవీ ప్రారంభమైంది... చిరంజీవి ముఖ్య అతిథిగా..

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments