Publish Date: Fri, 17 Jun 2022 (14:17 IST)
Updated Date: Fri, 17 Jun 2022 (14:35 IST)
సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. నిరసనకారులు హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు హింసాత్మక ఘర్షణలు జరిగాయి. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు ఆందోళనకారులు నిప్పుపెట్టారు. దీంతో ఏపీలో రైల్వే పోలీసులు, రాష్ట్ర పోలీసులు అప్రమత్తమయ్యారు.
ఏపీలోని పలు కీలక రైల్వే స్టేషన్ల వద్ద భారీగా మొహరించి భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా విజయాడలో హైఅలెర్ట్ ప్రకటించారు. స్టేషన్ల పరిసరాల్లో ఎవరూ గుమికూడకుండా పోలీసులు హెచ్చరికలు చేశారు. గుంటూరు, కడప, నరసరావు పేట, బాపట్ల స్టేషన్లలో రైల్వే రక్షణ దళాలు భద్రతను పెంచేశాయి. అలాగే, రైల్వే స్టేషన్లలో భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మొహరించారు. ఉన్నతాధికారులు ఎప్పటికపుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఆందోళనకారులు యువత విధ్యంసానికి పాల్పడి ఫ్లాట్ఫాంలపై ఉన్న దుకారణాల్లో వస్తువులు, ఫర్నీచర్ను ధ్వంసం చేశారు. రైళ్ల బోగీలకు నిప్పంటించడంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
ఠాగూర్
Publish Date: Fri, 17 Jun 2022 (14:17 IST)
Updated Date: Fri, 17 Jun 2022 (14:35 IST)