Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు

exams
, గురువారం, 16 జూన్ 2022 (19:15 IST)
పదో తరగతి విద్యార్థులకు బెటర్‌మెంట్ పరీక్షలు నిర్వహించాలని ఏపీ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేశారు. ఇక 49 అంతకంటే  తక్కువ మార్కులు వచ్చిన వారికి రెండు సబ్జెక్టుల్లో కూడా బెటర్‌మెంట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు. అలాగే సబ్జెక్టుకు రూ.500 ఫీజుతో పరీక్ష రాసేందుకు కూడా వెసులుబాటు కల్పించడం జరిగింది.
 
ఇక ఈ ఏడాది పది పరీక్షలు రాసిన వారికి మాత్రమే బెటర్‌మెంట్‌ రాసే అవకాశం ఉందని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది. ఇక రాష్ట్రంలో చాలా మంది విద్యార్థులు కూడా టెన్త్ ఫెయిల్ అయ్యారు. 
 
దీనిపై విద్యార్థులలో ఆందోళన అనేది నెలకొంది. దీంతో టెన్త్ ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల్లో పాస్ అయ్యాక వారిని కూడా రెగ్యులర్‌గా పాస్ అయిన వారి జాబితాలో సమానంగా చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నోట్స్ ఇస్తానని రూమ్‌కు పిలిచాడు.. ఆపై లైంగిక దాడికి యత్నం.. దేహశుద్ధి