Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విశాఖలో ఇన్ఫోసిస్ పెట్టుబడులు - మంత్రి గుడివాడకు తెలియకుండానే..

infosys
, బుధవారం, 15 జూన్ 2022 (16:03 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ విశాఖపట్టణంలో కొత్త క్యాంపస్‌ను ఏర్పాటుచేసే దిశగా అడుగులు వేస్తుంది. ఇందుకోసం అక్కడ పెట్టుబడులు పెట్టాలని భావిస్తుంది. ముఖ్యంగా, తమ వద్ద పని చేస్తున్న ఉద్యోగులు, కొత్తగా నియమించుకుంటున్న ఉద్యోగుల్లో అత్యధిక శాతం మంది టైర్-2 సిటీల నుంచి వస్తున్నారని, అందుకే అలాంటి క్యాంపస్‌లు ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఇందుకోసం ఏపీలో మొత్తం నాలుగు టైర్-2 నగరాలను ఎంపిక చేసింది. 
 
ఇందులోభాగంగా, వెయ్యి మంది ఉద్యోగులతో తొలి క్యాంపస్ పెట్టే అవకాశం ఉంది. అయితే, ఈ విషయంలో ప్రభుత్వం ప్రమేయమే లేదు. పైగా, మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అసలు విషయమే తెలియదు. ఇన్ఫోసిస్ సొంతంగా ప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేకుండానే ఈ క్యాంపస్‌లను నెలకొల్పనుంది. మేమే వెళ్లాం.. మేమే తీసుకొచ్చాం అనే ప్రచారానికి తావులేకుండా, రాజకీయ నేతల ప్రమేయం అస్సలు లేకుండా ఈ క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఇన్ఫోసిస్ భావిస్తుంది. 
 
అయితే, ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా ఈ క్యాంపస్‌ను స్థాపించడం సాధ్యమేనా అనే చర్చ కూడా సాగుతోంది. పైగా, ప్రభుత్వం పెద్దలు ఈగోలకు వెళితే మాత్రం ఇన్ఫోసిస్ తన నిర్ణయం మార్చుకునే అవకాశం లేకపోలేదని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

5జీ స్పెక్ట్రమ్ వేలానికి పచ్చజెండా ఊపిన కేంద్రం