Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం కేర్ ఫండ్స్‌కు రూ.కోటి బదిలీచేసిన పవన్ - టీఎస్ గవర్నర్ ప్రశంసలు

Webdunia
శుక్రవారం, 3 ఏప్రియల్ 2020 (19:07 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల చెన్నై హార్బరులో చిక్కుకున్న శ్రీకాకుళం జాలర్లను ఆదుకునే విషయంలో పవన్ ప్రత్యేక చొరవ చూపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి దృష్టికి తీసుకెళ్లి జాలర్లను ప్రాణాలతో పవన్ కాపాడారు. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్... పవన్‌ను అభినందిస్తూ ట్వీట్ చేశారు.
 
ఇపుడు మరోమారు పవన్‌ను ప్రశంసించారు. దీనికి కారణం లేకపోలేదు. కరోనా వైరస్ బాధితులను ఆదుకునేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కేర్స్ ఫండ్‌ను నెలకొల్పారు. దీనికి పవన్ తనవంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఈ నిధులను ఆయన నెఫ్ట్ ద్వారా బదిలీ చేశారు. దీనికి సంబంధించిన అక్నాలెడ్జ్‌మెంట్‌ను తన ట్విట్టర్ ఖాతాలో పవన్ షేర్ చేశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న గవర్నర్ తమిళిసై... పవన్‌పై ప్రశంసలు కురిపించారు. పవన్ కల్యాణ్ చర్యలు లక్షలాది మంది ప్రజలకు మరింత స్ఫూర్తినిస్తాయని, దూరదృష్టిగల మన పీఎం ద్వారా దేశానికి సాయపడుతున్న పవన్ పెద్ద మనసుకు సెల్యూట్ అంటూ కొనియాడారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments