Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చినందుకు అన్నను చంపేసిన ప్రేమికుడు..

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:47 IST)
ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో ప్రేమికులను బెదిరించి వారిని వేరు చేసిన వారిని చూసాము. అలాగే పరువు హత్యలు కూడా చూసాము. చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని ప్రేమికుడిని చంపిన అన్నయ్యలు ఉన్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
 
తన చెల్లెల్ని వేరొకరు ప్రేమిస్తున్నారని తెలుసుకున్న అన్నయ్య ఆ ప్రేమికుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ప్రియురాలి అన్నపై కక్ష పెంచుకున్న ప్రేమికుడు అతడిని కత్తితో పీక కోసి హత్య చేసాడు. ఈ దుర్ఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది.
 
పాల్వంచ తెలంగాణనగర్‌లో షకీల్ నివాసం ఉంటున్నాడు. తన చెల్లెల్ని శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన స్నేహితుల సాయంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తనను అవమానించినందుకు బాధపడిన శివశంకర్‌రెడ్డి షకీల్‌పై కక్ష పెంచుకున్నాడు. 
 
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే శివశంకర్‌రెడ్డి అదును చూసుకుని షకీల్‌ను హత్య చేసాడు. షకీల్‌ను కత్తితో మెడనరికి దారుణంగా చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments