చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని వార్నింగ్ ఇచ్చినందుకు అన్నను చంపేసిన ప్రేమికుడు..

Webdunia
శుక్రవారం, 5 జులై 2019 (16:47 IST)
ఇప్పటివరకు మనం చాలా సందర్భాల్లో ప్రేమికులను బెదిరించి వారిని వేరు చేసిన వారిని చూసాము. అలాగే పరువు హత్యలు కూడా చూసాము. చెల్లెల్ని ప్రేమిస్తున్నాడని ప్రేమికుడిని చంపిన అన్నయ్యలు ఉన్నారు. కానీ ఇందుకు భిన్నంగా ఓ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.
 
తన చెల్లెల్ని వేరొకరు ప్రేమిస్తున్నారని తెలుసుకున్న అన్నయ్య ఆ ప్రేమికుడికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. ప్రియురాలి అన్నపై కక్ష పెంచుకున్న ప్రేమికుడు అతడిని కత్తితో పీక కోసి హత్య చేసాడు. ఈ దుర్ఘటన తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో జరిగింది.
 
పాల్వంచ తెలంగాణనగర్‌లో షకీల్ నివాసం ఉంటున్నాడు. తన చెల్లెల్ని శివశంకర్‌రెడ్డి అనే వ్యక్తి ప్రేమిస్తున్నాడని తెలుసుకుని తన స్నేహితుల సాయంతో అతనికి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. తనను అవమానించినందుకు బాధపడిన శివశంకర్‌రెడ్డి షకీల్‌పై కక్ష పెంచుకున్నాడు. 
 
సరైన సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. అయితే శివశంకర్‌రెడ్డి అదును చూసుకుని షకీల్‌ను హత్య చేసాడు. షకీల్‌ను కత్తితో మెడనరికి దారుణంగా చంపేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'పెద్ది'లో చరణ్ పెర్ఫార్మెన్స్ మైండ్‌బ్లోయింగ్‌, ఫ్యామిలీతో కలిసి చూడండి: దర్శకుడు బుచ్చిబాబు సానా

రవితేజ, శివ నిర్వాణ, మైత్రి మూవీ మేకర్స్ ఇరుముడి నుంచి ది హార్ట్ ఆఫ్ ఇరుముడి గ్లింప్స్‌ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబీ చిరు158 పొల్లాచ్చిలో కీలక షెడ్యూలు ప్రారంభం

విశాఖపట్నం రోడ్డు ప్రమాదం.. డ్యాన్స్ మాస్టర్ పండు తీవ్రగాయాలు (video)

రోడ్డు ప్రమాదంలో 'ఢీ' జోడీ డ్యాన్స్ మాస్టర్ పండుకు గాయాలు

తర్వాతి కథనం
Show comments