Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మర్రి చెన్నారెడ్డి కొడుకుని... ఊపిరి ఉన్నంతవరకు కాంగ్రెస్‌లోనే.. : మర్రి శశిధర్ రెడ్డి

Advertiesment
Marri Sasidhr Reddy
, మంగళవారం, 2 జులై 2019 (18:14 IST)
తాను బీజేపీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఇదే అంశంపై ఆయన మంగళవారం మాట్లాడుతూ, నేను ఎన్నటికీ బీజేపీలో చేరబోనని గతంలో కూడా స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. కానీ పత్రికలలో నేను బీజేపీలో చేరినట్లు వచ్చింది. అది వాస్తవం కాదు. 
 
బీజేపీ కేంద్ర కార్యాలయం తప్పుడు సమాచారం ఇచ్చి రాయించింది. వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేస్తున్నారు. విలువలకు.. సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే వ్యక్తిని నేను మా తండ్రి మర్రి చెన్నారెడ్డి వారసుడిగానే నడుచుకుంటాను. సత్యదూరమైన వార్తలకు మీడియా ప్రాధాన్యత ఇవ్వొద్దు. చివరి క్షణం వరకు పార్టీ మారను. కాళేశ్వరం ప్రాజెక్టు రిడిజైన్ చేయడాన్ని గతంలోనే వ్యతిరేకించాను. 294 మంది... ఎమ్మెల్యేలు, 90 మంది ఎమ్మెల్యేలు దృష్టిలో ఉంచుకుని అసెంబ్లీ నిర్మాణం జరిగింది. 
 
ఇటీవల ఆధునికీకరణ చేసినప్పుడు కూడా ప్రస్తుత అవసరాలకు తగినట్లు మార్పు చేశారు. ప్రస్తుతం 119 మంది ఎమ్మెల్యేలు... 40 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీని మార్చాలని నిర్ణయం తీసుకోవడం సరికాదు. వాస్తు పిచ్చితో... సచివాలయం కూల్చి.. క్రొత్తదాన్ని నిర్మించి ప్రజాధనాన్ని వృధా చెయ్యడం అవివేకం అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు ముఖ్యమంత్రి కాదు.. ప్రతిపక్ష నేత.. గుర్తుపెట్టుకోవాలి : సుచరిత