Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - మాల్కాజిగిరి నుంచి మైనం... టీ కాంగ్రెస్ జాబితా ఇదే..

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (10:23 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే, మైనంపల్లి హన్మంతరావు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా ఆయనకు మల్కాజిగిరి స్థానం నుంచి సీటును కేటాయించారు. కొల్లాపూర్ నుంచి జూపల్లి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిలు పోటీకి దిగుతున్నారు. మొత్తం 55 మందితో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ ఈ జాబితాను విడుదల చేశారు. 
 
ఇటీవల తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావుకు కూడా సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌ను కేటాయించారు. అలాగే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ సీటు ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్‍‌‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనుకున్నట్టే కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. 
 
ఆయనకు మాల్కాజిగిరిని కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మాత్రం మెదక్ స్థానాన్ని ఇచ్చింది. ఆంధోల్ రిజర్వు స్థానాన్ని మాజీ మంత్రి దామోదర రాజనర్శింహా, మంథని నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు బరిలోకి దిగుతున్నారు. సీతక్క తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి పోటీ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments