Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి - మాల్కాజిగిరి నుంచి మైనం... టీ కాంగ్రెస్ జాబితా ఇదే..

Webdunia
ఆదివారం, 15 అక్టోబరు 2023 (10:23 IST)
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ జాబితాలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొండగల్ నుంచి బరిలోకి దిగుతున్నారు. అలాగే, మైనంపల్లి హన్మంతరావు తన పంతాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా ఆయనకు మల్కాజిగిరి స్థానం నుంచి సీటును కేటాయించారు. కొల్లాపూర్ నుంచి జూపల్లి, కల్వకుర్తి నుంచి కసిరెడ్డి నారాయణ రెడ్డిలు పోటీకి దిగుతున్నారు. మొత్తం 55 మందితో కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సి.వేణుగోపాల్ ఈ జాబితాను విడుదల చేశారు. 
 
ఇటీవల తెరాసకు రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి, పూర్వ కాంగ్రెస్ నేత జూపల్లి కృష్ణారావుకు కూడా సొంత నియోజకవర్గమైన కొల్లాపూర్‌ను కేటాయించారు. అలాగే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నల్గొండ సీటు ఇచ్చారు. ఇటీవల బీఆర్ఎస్‍‌‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు అనుకున్నట్టే కుమారుడికి టిక్కెట్ ఇప్పించుకున్నారు. 
 
ఆయనకు మాల్కాజిగిరిని కేటాయించిన కాంగ్రెస్ పార్టీ.. కుమారుడు మైనంపల్లి రోహిత్‌కు మాత్రం మెదక్ స్థానాన్ని ఇచ్చింది. ఆంధోల్ రిజర్వు స్థానాన్ని మాజీ మంత్రి దామోదర రాజనర్శింహా, మంథని నుంచి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులు బరిలోకి దిగుతున్నారు. సీతక్క తన సొంత నియోజకవర్గమైన ములుగు నుంచి పోటీ పడుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prabhas: ప్రభాస్ పెండ్లి చేసుకుంటాడనేది నిజమేనా?

ఉగాదిన నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ-రిలీజ్ ఫంక్షన్

మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు చెప్పిన చిత్ర బృందం

నితిన్, శ్రీలీల నటించిన రాబిన్ హుడ్ చిత్రం రివ్యూ

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments