Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో టీడీపీకి షాక్ : సీఎం కేసీఆర్ చెంతకు రావుల చంద్రశేఖర్ రెడ్డి?

ravula chandrasekhar reddy
, గురువారం, 12 అక్టోబరు 2023 (10:10 IST)
తెలంగాణ రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీకి గట్టి షాక్ తగలనుంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ మాజీ విప్, పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్ రెడ్డి పార్టీని వీడి భారత రాష్ట్ర సమితిలో చేరనున్నట్టు జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై ఆయన బీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరిపినట్టు సమాచారం. దీంతో ఈ నెల 15వ తేదీ లోపు ఆయన సీఎం కేసీఆర్ చెంతకు చేరవచ్చని ఊహాగానాలు వినొస్తున్నాయి. 
 
మరోవైపు, వనపర్తి నుంచి 1994, 2009లో ఆయన తెదేపా తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ విప్‌గా పని చేశారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడి టీడీపీ ముఖ్య నేతలు వివిధ పార్టీల్లో చేరారు. 
 
రావుల చంద్రశేఖర్‌ రెడ్డి మాత్రం టీడీపీలోనే ఉంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఆయన్ని పొలిట్‌బ్యూరో సభ్యుడిగా నియమించారు. వనపర్తి జిల్లాలో ఇప్పటికీ రావులకు వ్యక్తిగతంగా మంచిపట్టు ఉంది. బీఆర్ఎస్‌లో చేరికపై జోరుగా జరుగుతున్న ప్రచారంపై రావుల అభిప్రాయం కోసం ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ నగరంలో ఎక్కడ చూసినా నోట్ల కట్టలే...