తెలంగాణ కాంగ్రెస్‌కు షాక్ : టీసీఎల్పీని తెరాసలో విలీనం చేయండి...

Webdunia
శుక్రవారం, 21 డిశెంబరు 2018 (10:38 IST)
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ.. ఆ ఓటమి నుంచి ఇంకా తేరుకోనేలేదు. ఇపుడు మరో గట్టిదెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరిపోయారు. అంతేనా వారు ఏకంగా కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టీఆర్ఎస్‌లో విలీనం చేయాల్సిందిగా శాసనమండలి ఛైర్మన్ స్వామిగౌడ్‌కు లేఖ కూడా ఇచ్చారు. 
 
అలా తెరాసలోకి జంప్ అయిన ఎమ్మెల్సీల్లో సంతోష్, దామోదర్ రెడ్డి, ఆకుల లలిత, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. వీరంతా స్వామిగౌడ్‌ను కలిసి సీఎల్పీని తెరాసలో విలీనం చేయాల్సిందిగా కోరారు. ఈ మేరకు లిఖిపూర్వకంగా కూడా లేఖ కూడా ఇచ్చారు. 
 
అయితే టీఆర్ఎస్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైన భూపతి రెడ్డి, యాదవ రెడ్డి, కొండా మురళీ, రాములు నాయక్ ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుపున ప్రచారం చేశారు. వారిపై అనర్హత వేటు వేయాలని తెరాస ఇప్పటికే ఫిర్యాదు చేసింది. దీంతో వారికి మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ నోటీసులు కూడా జారీ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అతని కోసం పెద్ది చిత్రంలో నటించాలని నిర్ణయం తీసుకున్నా : దివ్యేందు శర్మ

M.M. Keeravani: లవ్ స్టోరీలో ఏడు పాటలు ఉంటాయంటే బ్లాక్ బస్టర్ : ఎంఎం కీరవాణి

మా ఇంటి బంగారం కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌: ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో సమంత

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

తర్వాతి కథనం
Show comments