Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (14:50 IST)
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా వుందనే అంశంపై చేసిన సర్వేలో.. టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయిందని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 103 నుంచి 106 సీట్లను కైవసం చేసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
 
2004లో తాము పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంబించిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

సైనిక అధికారులకు కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానోత్సవం

కమెడియన్‌ ప్రవీణ్‌ బకాసుర రెస్టారెంట్‌ నుంచి జాతీయం లిరికల్‌ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments