ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ ఇచ్చారు..

Webdunia
ఆదివారం, 25 నవంబరు 2018 (14:50 IST)
తెలంగాణలో మధ్యంతర ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాన్ని ఎవరూ కూడా ఆపలేరని ఆ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఎలా వుందనే అంశంపై చేసిన సర్వేలో.. టీఆర్ఎస్ విజయం ఖాయమని తేలిపోయిందని కేసీఆర్ చెప్పారు. ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కారే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 
 
తాజా సర్వే ప్రకారం తెలంగాణలో 103 నుంచి 106 సీట్లను కైవసం చేసుకుంటుందని కేసీఆర్ తెలిపారు. తాండూరులో నిర్వహించిన ఎన్నికల సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు గెలిస్తేనే నిజమైన ప్రజాస్వామ్యమని తెలిపారు. అభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుందని చెప్పారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పర్యటన గురించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ ఘాటుగా స్పందించారు.
 
2004లో తాము పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ ఇస్తే బాగుండేదన్నారు. కానీ 14 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా సాచివేత ధోరణిని అవలంబించిందన్నారు. తాను తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ దీక్ష చేస్తే గత్యంతరం లేకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కేసీఆర్ చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sudheer: సుడిగాలి సుధీర్, దివ్యభారతి జంటగా G.O.A.T షూటింగ్ పూర్తి

ఆకాష్ జగన్నాథ్ ఆవిష్కరించిన వసుదేవసుతం టైటిల్ సాంగ్

Roshan: రోషన్ హీరోగా పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఛాంపియన్

Janhvi Kapoor: రూటెడ్ మాస్ పాత్రలో అచ్చియమ్మ గా జాన్వీ కపూర్

The Girlfriend: ది గర్ల్ ఫ్రెండ్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది - ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

నాట్స్ విస్తరణలో మరో ముందడుగు, షార్లెట్ చాప్టర్ ప్రారంభించిన నాట్స్

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments