Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు రేపు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు - రైతుల ఆందోళన

Webdunia
సోమవారం, 20 మార్చి 2023 (09:05 IST)
రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు భారీ వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఈ రెండు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలు మరో రెండు రోజుల పాటు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా, పిడుగులు, ఉరుములు, మెరుపులతో ఈ వర్షాలు కురిస్తే చేతికొచ్చిన పంట నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో ఈ అకాల వర్షాలు ఏంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
 
గత రెండు రోజులుగా అనేక ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ముఖ్యంగా, శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షాలు కురిశాయి. తెలంగాణాలో రాష్ట్ర వ్యాప్తంగా 8 జిల్లాల్లో ఏడు సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. అదేసమయంలో ఈ రెండు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గిపోతున్నాయి. గత రెండు రోజుల్లోనే 5 డిగ్రీల సెల్సియస్ తగ్గింది. దీనికితోడు ఈదురు గాలులు బలంగా వీస్తుండంతో ప్రజలు వణికిపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments