ఆంధ్రప్రదేశ్‌ను మూడు ముక్కలు చేస్తే ముగ్గురు సీఎంలు కావొచ్చు : జగ్గారెడ్డి

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (17:17 IST)
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే ముగ్గురు ముఖ్యమంత్రులు కావొచ్చని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తెలంగాణాలో కొత్తగా పార్టీ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కుమార్తె వైఎస్. షర్మిలకు జగ్గారెడ్డికి మధ్య మాటల యుద్ధం సాగుతోంది. సంగారెడ్డిలో పర్యటిస్తున్న షర్మిల.. జగ్గారెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. వీటికి జగ్గారెడ్డి ధీటుగా సమాధానమిచ్చారు. షర్మిల తన జోలికి రాకుంటే తాను కూడా ఆమె జోలికి వెళ్ళనని చెప్పారు. 
 
ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్ కటుంబంలో గొడవ జరుగుతోందన్నారు. ఆ గొడవకు పరిష్కారం కావాలంటే ఏపీకి 3 రాజధానులు ఏర్పాటు కంటే ఆ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేస్తే (మూడు రాష్ట్రాలు) ముగ్గురు సీఎంలు కావొచ్చన్నారు. అలా చేయడం వల్ల జగన్‌తో పాటు సీఎం కుర్చీకోసం ఎదురు చూస్తున్న షర్మిలతో పాటు విజయసాయిరెడ్డి కూడా సీఎం అయిపోవచ్చన్నారు. షర్మిల తన కుటుంబ పంచాయతీని ఏపీలోనే పెట్టుకోవాలని హితవు పలికారు. ఇందుకోసం అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడుకుని సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మతం పేరుతో ఇతరులను చంపడం - హింసించడాన్ని వ్యతిరేకిస్తా : ఏఆర్ రెహ్మాన్

సినీ నటి హేమకు కర్నాటక కోర్టులో ఊరట.. డ్రగ్స్ కేసు కొట్టివేత

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments