Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకున్న ఏపీ సర్కారు

Webdunia
మంగళవారం, 27 సెప్టెంబరు 2022 (16:44 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరోమారు రుణం తీసుకుంది. భారత రిజర్వు బ్యాంకు బాండ్లను వేలం చేయడం ద్వారా ఈ రుణాన్ని సేకరించింది. మొత్తం వెయ్యి కోట్ల రూపాయలను అప్పుగా తీసుకుంది. మొత్తం రూ.వెయ్యి కోట్లలో రూ.500 కోట్లను 12 సంవత్సరాలకు 7.71 శాతం వడ్డీతోనూ, మరో రూ.500 కోట్లు రూ.7.60శాతం వడ్డీకి తీసుకుంది. దీంతో ఈ యేడాదిలో ఇప్పటివరకు ఏపీ సర్కారు తీసుకున్న మొత్తం రుణం రూ.49600 కోట్లకు చేరుకుంది. 
 
రిజర్వు బ్యాంకులో ప్రతి మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం పాటలు జరుగుతుంటాయి. గత కొంతకాలంగా ప్రతి మంగళవారం ఏపీ ప్రభుత్వం క్రమం తప్పకుండా ఈ వేలం పాటలో పాల్గొని రుణాన్ని సేకరిస్తుంది. ఆ విధంగా ప్రతి మంగళవారం రూ.1000 కోట్ల మేరకు రుణం సేకరిస్తుంది. 
 
అయితే, గతంలో తీసుకున్న రుణానికి వసూలు చేసే వడ్డీ కంటే ఇపుడు తీసుకున్న రుణానికి విధించిన వడ్డీ శాతం అధికమనే వాదనలు వినిపిస్తున్నాయి. 
 
మరోవైపు, కేంద్రం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిధిని ఏపీ ప్రభుత్వం దాటేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో నాబార్డు రుణాలు మినహా మరే ఇతర రుణాలు ఏపీ సర్కారు అందే అవకాశమే లేదని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Story: అల్లు అర్జున్, ప్రభాస్ కు మధ్య దీపిక పదుకొనె ఎంపిక చిచ్చు రగిలిస్తుందా?

Deepika Padukone: అల్లు అర్జున్, అట్లీ చిత్రంలో బాలీవుడ్ దీపికా పదుకొనె

Pawan : ఎ.ఎం.రత్నం కు అన్నీ అడ్డంకులేనా? హరిహర వీరమల్లు ఆలస్యానికి కారణమదేనా?

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments