Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీఆర్ఎస్‌ది గ్రాఫిక్స్ పాలన.. కేసీఆర్.. ప్రధాని మోదీ అన్నదమ్ములే!

Advertiesment
jaggareddy
, మంగళవారం, 3 మే 2022 (14:27 IST)
టీఆర్ఎస్‌ది గ్రాఫిక్స్ పాలన అని మండిపడ్డారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. రైతులను ముంచడంలో కేసీఆర్.. ప్రధాని మోదీ అన్నదమ్ములే అన్నారు జగ్గారెడ్డి. శివాజీ సినిమా.. రజినీకాంత్ స్టైల్‌లో ఉంది కేసీఆర్ పాలన అని జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. 
 
గతంలో తాము ఉచిత విద్యుత్ ఇచ్చి రూపాయి ప్రచారం చేసుకున్నాం. కానీ కేసీఆర్ ఇచ్చే విద్యుత్‌కి అయ్యేంత ఖర్చు పబ్లిసిటీకి పెడుతున్నారని జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. లక్ష రూపాయలు మాఫీ తాము చేశాం. కేసీఆర్ చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకుంటున్నారు. చేసేది పది పైసల పని.. చేసేది వంద రూపాయల ప్రచారం.. అంటూ కేసీఆర్ మండిపడ్డారు. 
 
టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం కోసమే కాంగ్రెస్ నేత రాహుల్ తెలంగాణ వస్తున్నారు. ఉస్మానియా యూనివర్శిటీ పర్యటనపై కార్యాచరణ ఉంటుంది. వరుసగా మూడు రోజుల కార్యాచరణ ఉంటుందన్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పని చేయని 18.05 లక్షల వాట్సాప్ ఖాతాలు