"గ్రేటర్ వార్" : అభ్యర్థులు - ఓటర్లు పాటించాల్సిన నిబంధనలు ఇవే...

Webdunia
గురువారం, 19 నవంబరు 2020 (11:27 IST)
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నగారా మోగింది. ఈ ఎన్నికల పోలింగ్ డిసెంబరు ఒకటో తేదీన జరుగనుండగా, నాలుగో తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. ఈ క్రమంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే, నామినేషన్లు వేసేందుకు వచ్చే అభ్యర్థుల విధిగా పాటించాల్సిన నిబంధనలను ఎన్నికల సంఘం ప్రకటించింది. 
 
* నామినేషన్ వేసేందుకు కేవలం రెండు వాహనాల్లో మాత్రమే రావాల్సి వుంటుంది. ఆపై, అభ్యర్థుల ప్రచారం సమయంలో భద్రతా సిబ్బందిని మినహాయిస్తే, ఐదుగురి కన్నా ఎక్కువ మంది ఉండేందుకు వీల్లేదు. 
 
* ఎన్నికల్లో పోటీ చేసే వారు తమ ప్రచార సభలను విశాలమైన హాల్స్‌లో కెపాసిటీలో సగం మందికి మాత్రమే అనుమతిస్తూ నిర్వహించుకోవాలి. అక్కడ కూడా శానిటైజర్, మాస్క్ తప్పనిసరిగా ఉంచాలి. 
 
* ఇక రిటర్నింగ్ అధికారి చాంబర్‌లో సైతం భౌతిక దూరం నిబంధనలు అమలవుతాయి. చిహ్నాల కేటాయింపు కూడా విశాలమైన ప్రదేశంలో చేయాల్సి వుంటుంది. నామినేషన్ దాఖలు చేసే వేళ, ఇద్దరిని మాత్రమే అనుమతిస్తారు. 
 
* పోలింగ్ సిబ్బంది మరిన్ని వాహనాలు సమకూర్చుకుని కిక్కిరిసిన విధంగా కాకుండా, దూరదూరంగా కూర్చుని పోలింగ్ బూత్‌లకు వెళ్లాలి. ఎన్నికల సిబ్బంది ఫోన్లలో ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరిగా డౌన్‌లోడ్ చేసుకునివుండాలి. 
 
* ఎవరైనా జలుబు, దగ్గు, జ్వరంతో ఉంటే, వారి స్థానంలో మరొకరిని నియమించేందుకు వీలైనంత మంది రిజర్వుడ్ సిబ్బందిని సిద్ధంగా ఉంచాలి.
 
* ఇక ఓటర్ల విషయానికి వస్తే, ముఖానికి నిర్దేశిత విధానంలో మాస్క్ తప్పనిసరి. మూతి, ముక్కు మూసుకునేలా మాస్క్ ధరిస్తేనే పోలింగ్ స్టేషన్‌లోకి అనుమతిస్తారు. 
 
* ఆపై అసలైన ఓటరును గుర్తించేందుకు ఒకమారు మాస్క్ తీయాల్సి వుంటుంది. ఆపై వెంటనే మాస్క్ ధరించాలి. ఓటేసే సమయంలో ఒక్కో ఓటరు మధ్య కనీసం 6 అడుగుల దూరం తప్పనిసరి. ఇందుకోసం ముందుగానే పోలింగ్ కేంద్రాల్లో మార్కింగ్ చేయాలి.
 
* కరోనా విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోస్టర్లను అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రదర్శించాలి. పోలింగ్ అధికారులు, సిబ్బందికి సరిపడినన్ని మాస్క్‌లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్‌లను ముందుగానే సిద్ధం చేయాలి. 
 
* ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద కూడా ఇదే తరహా ముందు జాగ్రత్తలు తప్పనిసరని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments