Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరో 10 రైళ్లు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:49 IST)
ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు నగరాలను తమ ఊర్లకు వెళ్లే వారికోసం అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రటించింది. ఈ రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరుతాయి. అలాగే, మరికొన్ని రైళ్లు కాజీపేట, నల్గొండల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ఈ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో అనేక తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 10 రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఈ నెల 1, 14న కాచిగూడ - విశాఖపట్టణం, 8, 16న విశాఖపట్టణం - కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్ - కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ - లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
 
అయితే కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడ్వైజరీ బోర్డ్‌లో భాగం చేసినందుకు ప్ర‌ధాని మోదీకి చిరంజీవి ధ‌న్య‌వాదాలు

త్రిబాణధారి బార్భరిక్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్

రమేష్ బాబు ఎందరినో మోసం చేసాడు, సివిల్ కోర్టులో కేసు నడుస్తోంది : -ఫైనాన్సియర్స్ సదానంద్

చాలా కాలంగా మిస్ అయ్యాను, తండేల్ తో మళ్ళీ నాకు తిరిగివచ్చింది : అక్కినేని నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాలెంటైన్స్ డే: ఈ సీజన్‌లో కాలిఫోర్నియా బాదంపప్పులతో ప్రేమ, ఆరోగ్యాన్ని వ్యాప్తి చేయండి

Rose Day 2025 : రోజ్ డే 2025- ఏ రంగులో గులాబీ పువ్వు? వాడిపోయిన పువ్వులు?

రోజుకి గ్లాసు పాలు తాగడం వల్ల ప్రయోజనాలు ఏమిటి?

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

తర్వాతి కథనం
Show comments