Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరో 10 రైళ్లు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:49 IST)
ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు నగరాలను తమ ఊర్లకు వెళ్లే వారికోసం అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రటించింది. ఈ రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరుతాయి. అలాగే, మరికొన్ని రైళ్లు కాజీపేట, నల్గొండల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ఈ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో అనేక తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 10 రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఈ నెల 1, 14న కాచిగూడ - విశాఖపట్టణం, 8, 16న విశాఖపట్టణం - కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్ - కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ - లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
 
అయితే కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments