ప్రయాణికులకు శుభవార్త - సంక్రాంతికి మరో 10 రైళ్లు

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:49 IST)
ప్రయాణికులకు దక్షిణమధ్య రైల్వే మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగకు నగరాలను తమ ఊర్లకు వెళ్లే వారికోసం అదనంగా మరో పది ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్టు ప్రటించింది. ఈ రైళ్లు కాచిగూడ, లింగంపల్లి నుంచి బయలుదేరుతాయి. అలాగే, మరికొన్ని రైళ్లు కాజీపేట, నల్గొండల మీదుగా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. 
 
సంక్రాంతి పండుగ కోసం దక్షిణ మధ్య రైల్వే ఇప్పటికే అనేక ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయితే, ఈ రైళ్లలో రిజర్వేషన్ టిక్కెట్లు హాట్ కేకుల్లా కొన్ని గంటల్లోనే అమ్ముడుపోయాయి. దీంతో అనేక తమ సొంతూర్లకు వెళ్లేందుకు ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో 10 రైళ్లను నడుపనున్నట్టు ప్రకటించింది. 
 
ఇందులో ఈ నెల 1, 14న కాచిగూడ - విశాఖపట్టణం, 8, 16న విశాఖపట్టణం - కాచిగూడ, 11న కాచిగూడ - నర్సాపూర్, 12న నర్సాపూర్ - కాచిగూడ, 19, 21న కాకినాడ టౌన్ - లింగంపల్లి, 20, 22న లింగంపల్లి - కాకినాడ టౌన్‌కు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. 
 
అయితే కాచిగూడ నుంచి విశాఖపట్టణం వెళ్లే రైలు కాజీపేట మీదుగా, కాచిగూడ నుంచి నర్సాపూర్ వెళ్లే రైళ్లు నల్గొండ మీదుగా, కాకినాడ టౌన్ నుంచి లింగంపల్లి వెళ్లే రైళ్లు సామర్లకోట మీదుగా నడుస్తాయని వివరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

HBD Rajamouli: ఎస్ఎస్ రాజమౌళి పుట్టిన రోజు.. మహేష్ బాబు సినిమా టైటిల్ అదేనా? (video)

Srinidhi Shetty: సీత పాత్ర మిస్ అయ్యా, వెంకటేష్, త్రివిక్రమ్ సినిమాలో చేయాలనుకుంటున్నా : శ్రీనిధి శెట్టి

Marriage Rumors: పెళ్లికి రెడీ అవుతున్న త్రిష.. చండీగఢ్‌ వ్యాపారవేత్తతో డుం.. డుం.. డుం..?

Teja: నటి సంతోషిని హెల్త్ కేర్ రిహాబిలిటేషన్ సెంటర్ లో దర్శకుడు తేజ

Charmi Kaur: విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం: మానసిక సమస్యలు అధిగమించడం ఎలా?

బాదం పాలు తాగుతున్నారా?

ఈ దీపావళికి, ఫ్రెడెరిక్ కాన్‌స్టాంట్ తమ హైలైఫ్ లేడీస్ క్వార్ట్జ్ పండుగ బహుమతులు

బాలబాలికలకు శ్రీకృష్ణుడు చెప్పిన 8 ముఖ్యమైన సందేశాలు

దీపావళి డ్రెస్సింగ్, డెకర్: ఫ్యాబ్ఇండియా స్వర్నిమ్ 2025 కలెక్షన్‌

తర్వాతి కథనం
Show comments