Webdunia - Bharat's app for daily news and videos

Install App

కురుపాంలో ఇద్దరు ఇంటర్ బాలికలపై అత్యాచారం

Webdunia
ఆదివారం, 2 జనవరి 2022 (11:19 IST)
విజయనగరం జిల్లా కురుపాంలో ఇద్దరు మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. కొత్త సంవత్సర వేడుకలను జరుపుకుని కాలేజీ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న ఇద్దరు బాలికలను ఓ దండగుడు అడ్డగించి పోలీసునని బెదిరించి అత్యాచారానికి తెగబడ్డాడు. దీనిపై బాధిత విద్యార్థుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని జియ్యమ్మవలస మండలానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు కురుపాంలోని పోస్ట్ మెట్రిక్ వసతి గృహంలో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. వీరిద్దరూ శనివారం మధ్యాహ్నం హాస్టల్ నుంచి బయటకు వచ్చిన రేగటి గ్రామానికి వెళ్లారు. అక్కడ కొత్త సంవత్సర వేడుకులను జరుపుకుని అక్కడి నుంచి తమ తమ ఇళ్లకు బయలుదేరారు. 
 
అయితే, మార్గమధ్యంలో రావాడ డ్యాం వద్ద రౌడీ షీటర్ రాంబాబు వారిని అడ్డగించి, పోలీసునని బెదిరించాడు. తాను చెప్పినట్టు వినకుంటే అరెస్టు చేస్తానని బెదిరించాడు. దీంతో వారిద్దరూ భయంతో వణికిపోయారు. తర్వాత ఒకరి తర్వాత ఒకరిపై లైంగికదాడికి తెగబడ్డాడు. ఆ తర్వాత వారిద్దరిని వదిలివేసి పారిపోయాడు. దీనిపై బాధిత బాలికలు తమ కుటుంబ సభ్యులకు ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. రౌడీషీటర్ కోసం గాలిస్తున్నారు. బాలికలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

రేణుకాస్వామికి బదులు నిన్ను హత్య చేయాల్సింది ... అత్యాచారం చేస్తాం : నటి రమ్యకు బెదిరింపులు

సమాజంలోని సంఘటనల నేపథ్యంగా యముడు చిత్రం తీశాం : దర్శకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments