Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్‌లో స్వల్ప మార్పులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:15 IST)
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 9నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియలను ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదలు కాగా, వెబ్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం(ఈ నెల 12) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
 
అయితే ఇటు కాలేజీలకు యూనివరిసిటీ అప్లియేషన్స్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని కోర్సులకు ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారులు కౌన్సిలింగ్ తేదీల్లో స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధంగా అధికారులు మార్పు చేశారు.
 
18వ తేది మొదలు కానున్న వెబ్ ఆప్షన్లు 22వ తేదీ వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థి  ఎంచుకున్న ఆప్షన్లు ప్రీజ్ కావడంతో ఈ నెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులకు 1,10,873 సీట్లున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కోర్సులను, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారంపాటు ఆప్షన్ల నమోదును వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments