Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ఎంసెట్-2020 కౌన్సిలింగ్‌లో స్వల్ప మార్పులు

Webdunia
సోమవారం, 12 అక్టోబరు 2020 (12:15 IST)
ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే తెలంగాణ ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 9నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్ ప్రక్రియలను ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మొదలు కాగా, వెబ్ ఆప్షన్ ప్రక్రియ సోమవారం(ఈ నెల 12) నుంచి ప్రారంభం కావాల్సి ఉంది.
 
అయితే ఇటు కాలేజీలకు యూనివరిసిటీ అప్లియేషన్స్ జారీ ప్రక్రియ నెమ్మదిగా సాగుతుండడం, ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన కొన్ని కోర్సులకు ఇంకా అనుమతి రాకపోవడంతో అధికారులు కౌన్సిలింగ్ తేదీల్లో స్వల్ప మార్పు చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకునే విధంగా అధికారులు మార్పు చేశారు.
 
18వ తేది మొదలు కానున్న వెబ్ ఆప్షన్లు 22వ తేదీ వరకు ఇచ్చేలా వీలు కల్పించారు. అభ్యర్థి  ఎంచుకున్న ఆప్షన్లు ప్రీజ్ కావడంతో ఈ నెల 24న సీట్ల అలాట్మెంట్ పూర్తవుతుంది. ఇకపోతే రాష్ట్ర వ్యాప్తంగా 201 ఇంజినీరింగ్ కాలేజీల్లో బీటెక్ కోర్సులకు 1,10,873 సీట్లున్నాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు 2020-21 విద్యా సంవత్సరంలో వివిధ కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడానికి దరఖాస్తు చేసుకున్నాయి. ఆ కోర్సులను, సీట్లను ప్రభుత్వం ఆమోదించాల్సి ఉంది. దీంతో వారంపాటు ఆప్షన్ల నమోదును వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఈ బర్త్ డే నుంచి నాకు కొత్త జన్మ మొదలు కాబోతోంది : మంచు మనోజ్

హీరో మహేశ్ బాబు కుటుంబంలో కరోనా వైరస్!!

జూనియర్ వెరీ ఎమోషన్ టచ్చింగ్ స్టొరీ : దేవిశ్రీ ప్రసాద్

హరిహర వీరమల్లు లో అసరుల హననం సాంగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు

Manisharma: మణిశర్మ ఆవిష్కరించిన వసుదేవ సుతం గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments