Webdunia - Bharat's app for daily news and videos

Install App

సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టిన మనవడు..

Webdunia
మంగళవారం, 14 జులై 2020 (19:38 IST)
పదో తరగతి చదువుతున్న కుర్రాడు.. ఆస్తి కోసం ఘాతుకానికి ఒడిగట్టాడు. సొంత నానమ్మను పెట్రోల్ పోసి తగులబెట్టాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలంలో ఈ ఘోరం జరిగింది. ఎలవర్తి గ్రామానికి చెందిన ఓ బాలుడు స్థానికంగా పదో తరగతి చదువుతున్నాడు. ఐతే ఇటీవల అతడి నానమ్మ కంసమ్మ.. తన ఆస్తిలోని కొంత భాగాన్ని కూతుళ్ల పేరిట రిజిస్టర్ చేయించింది. 
 
అప్పటి నుంచి నానమ్మపై ఆ బాలుడు పగ పెంచుకున్నాడు. తనకు రావాల్సిన ఆస్తిని మేనత్తలకు కట్టబెట్టడంపై ఆగ్రహంతో రగిలిపోయాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం ఇంట్లోనే నానమ్మపై పెట్రోల్ పోసి తగులబెట్టాడు. 
 
తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంటి నుంచి మంటలు రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. అప్పటికే ఇంటి గుమ్మం వద్ద కాలిపోయిన స్థితిలో కంసమ్మ మృతదేహం కనిపించింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments