Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు కరెంట్ షాక్ - చార్జీల పెంపునకు రంగం సిద్ధం

Webdunia
మంగళవారం, 28 డిశెంబరు 2021 (12:48 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కరెంట్ షాక్ తగలనుంది. రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ఆ రాష్ట్ర విద్యుత్ బోర్డు సిద్ధమైంది. ఇప్పటికే కొత్త విద్యుత్ టారిఫ్‌లను విద్యుత్ ఉత్పత్తి రంగ సంస్థలు ప్రతిపాదించి ప్రభుత్వానికి సమర్పించాయి. ఈ ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన మరుక్షణమే విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయనుంది. 
 
తాజాగా చేసిన ప్రతిపాదనల మేరకు... గృహ వినియోగదారులపై యూనిట్‌కు 50 పైసలు, వాణిజ్య వినియోగదారులపై ఒక్క రూపాయి చొప్పున పెంచేలా ప్రతిపాదించారు. ఈ మేరకు ఎలక్ట్రిక్ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)కి డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించింది. 
 
తెలంగాణాలోని విద్యుత్ డిస్కంలు దాదాపు 10 వేల కోట్ల లోటుతో నడుస్తున్నాయి. ఈ నష్టంలో కొంతైనా భర్తీ చేసుకునేందుకు వీలుగా ఇపుడు విద్యుత్ చార్జీలను పెంచాలని డిస్కంలు కోరుతున్నాయి. రైల్వే చార్జీలు, బొగ్గు రవాణా చార్జీలు పెరగడంతో విద్యుత్ చార్జీల పెంపు అనివార్యమైందని విద్యుత్ అధికారులు సెలవిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పచ్చని జీవితంలో నిప్పులు పోసిన కేన్సర్: టీవీ నటి దీపిక కాకర్‌కు లివర్ కేన్సర్

రొమాంటిక్ కామెడీ చిత్రంలో జాన్వీ కపూర్ - అందాల ఆరబోత?

Gaddar Awards: సినిమాలు చూడకుండా గద్దర్ అవార్డులు ప్రకటించారా?

ఈ లోకంలో నాలాంటి వారు : ఇళయరాజా

షష్టిపూర్తి కథను నమ్మాను, అందుకే మ్యూజిక్ ఇచ్చాను - ఇళయరాజా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

తర్వాతి కథనం
Show comments